E-Paper
Advertisement

Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌.. కేసీఆర్‌ ఓటమితో జోష్‌లో టీడీపీ..

Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌.. కేసీఆర్‌ ఓటమితో జోష్‌లో టీడీపీ..
Advertisement

Andhra Pradesh : తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీలో తెలుగు తమ్ముళ్లు జోష్‌లో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో కేసీఆర్‌ ఓటమిని ప్రస్తావిస్తూ.. జగన్‌కు కూడా అదే గతి పడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో కొద్దో గొప్పో అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌నే ప్రజలు ఓడించారని.. అలాంటి ఏపీలో ఏమాత్రం అభివృద్ధి చేయని జగన్‌కు జనం ఓటమి రుచి చూపిస్తారని ధీమాలో ఉన్నారు. తెలంగాణ, కర్ణాటన మాదిరే ఏపీలోనూ ప్రజలు మార్పు కోరుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు.

మరికొన్ని రోజుల్లోనే ఏపీలోనూ ప్రజా క్షేత్ర యుద్ధం జరగనుంది. అధికారంపై కన్నేసిన చంద్రబాబు తిరిగి సీఎం సీటును దక్కించకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అవకాశం దొరికినప్పుడల్లా జగన్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ వర్సెస్‌ టీడీపీ పొలిటికల్‌ వార్‌లో భాగంగా తెలంగాణ ఫలితాలను వాడుకుంటున్నారు టీడీపీ అధినేత. పక్కరాష్ట్రాల మాదిరి ఏపీలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జగన్‌ కు ఓటమి తప్పదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేసీఆర్‌ ఓటమి టీడీపీ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఏపీ వాసులు కూడా మార్పు కోరుకుంటే తమదే అధికారమన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు.

Related News

మాజీ స్పీకర్ తమ్మినేని చుట్టూ ఉచ్చు.. సీతారాం, కుటుంబసభ్యులపై కేసు, ఏం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×