E-Paper
Advertisement

Telangana floods: వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం.. మేము సైతం అంటూ.. ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళం

Telangana floods: వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం.. మేము సైతం అంటూ.. ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళం
Advertisement

Telangana floods: తెలంగాణను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. భారీ వ‌ర్షాల‌కు ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. చాలామంది ఇల్లు కోల్పోయారు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం ఉద్యోగుల జేఏసీ.. బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందు కొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం భారీగా జరిగింది. ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంతం చేసింది. అన్ని విభాగాల‌ ప్ర‌భుత్వ ఉద్యోగులు అందులో నిమ‌గ్న‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ విప‌త్తు భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. దీన్ని గమనించారు ప్రభుత్వ ఉద్యోగులు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత దీనిని అతిపెద్ద విప‌త్తుగా వర్ణించింది తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ.

Advertisement

ALSO READ: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతు ప్ర‌భుత్వానికి ఆర్ధిక సాయం చేయాలని ముందుకొచ్చింది జేఏసీ. ఇందులోభాగంగా రాష్ట్రంలో ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

Advertisement

తెలంగాణ‌లో అన్ని ప్ర‌భుత్వ విభాగాల్లోని ఉద్యోగులు దీనిపై నిర్ణ‌యం తీసుకున్నట్లు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి వెల్లడించారు.వ‌ర‌ద బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో ప్ర‌త్య‌క్షంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటామని తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి వరద ప్రాంతాల్లో రెండోరోజూ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో బాధితులను పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుటుందని భరోసా ఇచ్చారు.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×