E-Paper
Advertisement

Telangana floods: వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం.. మేము సైతం అంటూ.. ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళం

Telangana floods: వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం.. మేము సైతం అంటూ.. ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళం

Telangana floods: తెలంగాణను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. భారీ వ‌ర్షాల‌కు ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. చాలామంది ఇల్లు కోల్పోయారు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం ఉద్యోగుల జేఏసీ.. బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందు కొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం భారీగా జరిగింది. ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంతం చేసింది. అన్ని విభాగాల‌ ప్ర‌భుత్వ ఉద్యోగులు అందులో నిమ‌గ్న‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ విప‌త్తు భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. దీన్ని గమనించారు ప్రభుత్వ ఉద్యోగులు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత దీనిని అతిపెద్ద విప‌త్తుగా వర్ణించింది తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ.

ALSO READ: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతు ప్ర‌భుత్వానికి ఆర్ధిక సాయం చేయాలని ముందుకొచ్చింది జేఏసీ. ఇందులోభాగంగా రాష్ట్రంలో ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

తెలంగాణ‌లో అన్ని ప్ర‌భుత్వ విభాగాల్లోని ఉద్యోగులు దీనిపై నిర్ణ‌యం తీసుకున్నట్లు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి వెల్లడించారు.వ‌ర‌ద బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో ప్ర‌త్య‌క్షంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటామని తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి వరద ప్రాంతాల్లో రెండోరోజూ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో బాధితులను పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుటుందని భరోసా ఇచ్చారు.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×