Television Awards: టెలివిజన్ అవార్డు కమిటీతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో హాజరైన ఎఫ్డిసి ఎండీ ముకుంద రెడ్డి, కమిటి చైర్మన్,సభ్యులు పాల్గోన్నారు. సమావేశంలొ టెలివిజన్(టీవీ) అవార్డుల పై మంత్రితో చర్చించారు. టీవీ అవార్డుల కోసం ప్రత్యేక లోగో, ప్రముఖుల పేరు, ఏయే కేటగిరీలకు అవార్డులు ఇవ్వాలనే అంశాలపై సమావేశం ఎర్పాటు చేశారు.
టెలివిజన్ రంగంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నిచ్చే రంగం కీలకం అని అన్నారు. ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారని అన్నారు. టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి, మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్, ప్రోగ్రామ్స్, చిల్డ్రన్ మూవీలు తీసే వారిని ప్రోత్సహిస్తాంమని మంత్రి కొమటిరెడ్డి తెలిపారు. కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పి.వి నరసింహారావు పేరు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని మంత్రి హమీ ఇచ్చారు.
Also Read: NEET Counselling: నీట్ 2026 కౌన్సిలింగ్.. ఎంబిబిఎస్ అడ్మిషన్ స్టేట్ కోటాకు మీకు అర్హత ఉందా?
ఆయన బహుభాషా కోవిదుడు, తెలంగాణ ఠీవి పి.వి నరసింహారావు దేశాన్ని ఆర్ధికంగా నిలబెట్టిన గొప్ప మేధావి అట్లాంటి పేర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందిని మంత్రి తెలిపారు. కమిటీ వీలైనంత త్వరగా గైడ్లైన్స్, లోగో, అవార్డ్స్ పేరు లాంటివి తయారు చేసి ఇవ్వాలని కొమటి రెడ్డి తెలిపారు. పేరు అయిన, లోగో అయిన తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని అన్నారు.
రాష్ట్రంలో మొట్ట మొదటి సారి ఇవ్వబోయే ఈ అవార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నట్టు పూర్తి పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేయాలని కమిటీ చైర్మన్, సభ్యులకు మంత్రి కొమటి రెడ్డి సూచించారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ముకుంద రెడ్డి, ప్రత్యేక చొరవ చూపాలని, అవార్డుల వేదిక కూడా రెండు, మూడు ఆప్షన్స్ ఇవ్వండని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశాలన్నీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని మంత్రి కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి హమీ ఇచ్చారు.
Aso Read: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. రూ.281 కోట్ల నిధులు విడుదల!