E-Paper
Advertisement

University Reforms: తెలంగాణలో మారనున్న యూనివర్సిటీల రూపురేఖలు.. ప్రభుత్వం ప్లాన్ ఇదే..?

University Reforms: తెలంగాణలో మారనున్న యూనివర్సిటీల రూపురేఖలు.. ప్రభుత్వం ప్లాన్ ఇదే..?

University Reforms: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో యూనివర్సిటీల రూపురేఖలు మార్చేందుకు, చదువులో క్వాలిటీ పెంచడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వలక్ష్య​యాలకు అనుగుణంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను తెరపైకి తెచ్చింది. మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం అన్ని వర్సిటీల వైస్ చాన్స్ లర్లతో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ సెక్రటరీ శ్రీదేవసేన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీసీలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముందుగా అన్ని యూనివర్సిటీలు తాము చేసే ప్లాన్​ ను ప్రజెంట్ చేశాయి.

ఈ 100 రోజుల ప్లాన్‌..

ఈ సందర్బంగా యోగితారాణా వందరోజుల ప్లాన్ పై వివరించారు. స్టూడెంట్లు గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్‌ను తట్టుకునేలా ఉండాలని, అందుకే ఫ్యూచర్ రెడీ తెలంగాణ-2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. దీనికోసం అందరం కలిసి పనిచేద్దామని తెలిపారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం మాత్రమే కాదని, పిల్లల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరగాలని స్పష్టం చేశారు. ఈ 100 రోజుల ప్లాన్‌ను ఒక మిషన్ మోడ్‌లో అమలు చేయాలని ఆదేశించారు. పాత కాలం పద్ధతులు పక్కనపెట్టి.. క్లాసుల్లో లేటెస్ట్ టెక్నాలజీ వాడాలని యోగితా రాణా సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, హైబ్రిడ్ లెర్నింగ్ మెథడ్స్ వాడి పాఠాలు చెప్పాలని తెలిపారు. డిగ్రీ చదివే ప్రతి స్టూడెంట్ కచ్చితంగా ఇంటర్న్‌షిప్ చేసేలా ‘యూనిఫైడ్ ఇంటర్న్‌షిప్ గ్రిడ్’ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో చదువు అయిపోగానే ఈజీగా జాబ్ వస్తుందన్నారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశం.. ఛార్జిషీటులో కేసీఆర్ పేరు? రేపో మాపో అరెస్టులు

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు

ఇదిలా ఉండగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వర్సిటీల్లో అడ్మిషన్లు పెంచడం, స్టూడెంట్ల డ్రాపౌట్స్ తగ్గించడం పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టామని తెలిపారు. రీసెర్చ్ కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, కార్పొరేట్ కంపెనీల సాయం తీసుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. కాగా, అన్ని యూనివర్సిటీల్లో ఒకేసారి అడ్మిషన్లు, పరీక్షలు ఉండేలా కామన్ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, ఎస్​కే మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేశ్ ధోత్రే, పలువురు వీసీలు ఘంటా చక్రపాణి, ఉమేష్ కుమార్, సూర్యధనుంజయ్, కిషన్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Sree Leela: తల్లికి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన శ్రీలీల.. ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×