E-Paper
Advertisement

Madhavaram Krishna Rao: ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణ.. దమ్ముంటే నిరూపించండి: ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్

Madhavaram Krishna Rao: ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణ.. దమ్ముంటే నిరూపించండి: ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్
Advertisement

Madhavaram Krishna Rao: ఐడీపీఎల్ (IDPL) భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 4 వేల కోట్ల విలువైన ఈ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఐడీపీఎల్ పరిధిలోని సర్వే నెంబర్ 376లో జరిగిన ఆక్రమణలు, అక్రమాలపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఎమ్మెల్సీ కవిత భర్త ఐడీపీఎల్ భూమిని కబ్జా చేశారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించడం, దీనిని కవిత ఖండించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న విజిలెన్స్ విచారణ నిర్ణయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు. ఐడీపీఎల్ భూములపై విచారణ జరపాలని తానే స్వయంగా ప్రభుత్వాన్ని కోరానని, తన విజ్ఞప్తికి స్పందించి విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 20 ఏళ్లుగా తనపై రాజకీయ దురుద్దేశంతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఇప్పుడు ఆ ఆరోపణలను నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈ విచారణతో ఎవరెవరు ఆక్రమణలకు పాల్పడ్డారనే విషయంలో ఒక స్పష్టత వస్తుందని అన్నారు.

Advertisement

ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై కేవలం విజిలెన్స్ మాత్రమే కాకుండా, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సీబీఐ విచారణ జరిపించాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తాను గతంలోనే డిమాండ్ చేసినట్లు కృష్ణారావు గుర్తుచేశారు. అధికారుల తీరుపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని, కానీ శేరిలింగంపల్లిలో కబ్జాకు గురైన ఖరీదైన స్థలాలను మాత్రం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Read Also: Kondagattu Anjaneya Temple: కొండగట్టు అంజన్నకు నోటీసులు.. 15 రోజుల్లో..

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×