E-Paper
Advertisement

Telangana: పంద్రాగస్ట్‌కి తెలంగాణ హెడ్‌ కానిస్టేబుల్‌కి గ్యాలంటరీ అవార్డు..

Telangana: పంద్రాగస్ట్‌కి తెలంగాణ హెడ్‌ కానిస్టేబుల్‌కి గ్యాలంటరీ అవార్డు..
Advertisement

Telangana Head Constable Gallantry Award for August 15th : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఫైర్ సర్వీసెస్ హోంగార్డ్స్ సివిల్ డిఫెన్స్‌ అధికారులకు భారత కేంద్ర హోంశాఖ బుధవారం ఆయా పోలీస్ శాఖలకు సంబంధించి పతకాలను అనౌన్స్ చేసింది. భారత్‌ వ్యాప్తంగా 1037 మంది గ్యాలంటరీ సర్విస్ మెడల్స్‌ని అందించనున్నారు. ఈ మేరకు ప్రకటించిన అవార్డు గ్రహీతల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య చోటు దక్కింది. దేశంలోనే అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పతకాన్ని తెలంగాణ నుండి యాదయ్య ఒక్కడికే దక్కడం స్పెషల్.

తెలంగాణ పోలీస్ శాఖలో వర్క్‌ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్య 2002 ఏడాదిలో జరిగిన ఓ చోరీ కేసులో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో ధైర్యంతో చాకచక్యంగా వ్యవహరించాడు. అంతేకాదు ఇషాన్ నిరంజన్, రాహుల్ చైన్ స్నాచింగ్‌తో పాటుగా అక్రమంగా ఆయుధాలను ఎక్స్‌పోర్ట్ చేస్తుండేవారు. వీరిని హెడ్ కానిస్టేబుల్ యాదయ్య వెంబడించి సాహసించి వారిని పట్టుకున్నాడు. అదే ఏడాది జూలై 25 రోజున చోరికి పాల్పడుతుండగా యాదయ్య నిందితులను అడ్డుకున్నాడు. దుండగులు యాదయ్యపై కత్తితో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు.

Advertisement

Also Read: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్‌ టైం ఓరుగల్లులో..!

తనకు తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికి పట్టించుకోకుండా నిందితులను పట్టుకున్నాడు. దీంతో నిందితులు తీవ్రంగా గాయపరచడంతో యాదయ్య దవాఖానలో జాయిన్ అయ్యాడు. అందులోనే 18 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఆయన ధైర్య సాహసాన్ని మెచ్చి కేంద్రం తనని కొనియాడింది. స్వాతంత్ర్య దినోత్సవం ఆగష్టు 15న గ్యాలంటరీ అవార్డును అందించనున్నట్టు హోంశాఖ అనౌన్స్ చేసింది.

Advertisement

దేశవ్యాప్తంగా ఈ పతకాలను 1037 మందికి అందించనున్నారు. ఇందులో 214 మందికి మెడల్స్ ఫర్ గ్యాలెంటరీ,,95 మందికి రాష్ట్రపతికి విశిష్ట సేవా మెడల్స్,, 730 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలను అందించనుంది కేంద్ర హోంశాఖ. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి 46 పతకాలు సాధించారు. తెలంగాణ నుండి 21, ఏపీ నుండి 25 మందికి ఈ పతకాలు దక్కనున్నాయి.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×