E-Paper
Advertisement

ఫీజుల వివాదం.. ప్రైవేట్ కాలేజీలకు హైకోర్టులో భారీ ఊరట

ఫీజుల వివాదం.. ప్రైవేట్ కాలేజీలకు హైకోర్టులో భారీ ఊరట
Advertisement

Telangana High Court: ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో ఊరట దక్కింది. విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చెయ్యొద్దని ప్రభుత్వం జారీ చేసిన జీవో 9లోని కొన్ని మార్గదర్శకాలపై న్యాయస్థానం వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యoతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు కొన్ని ప్రశ్నలను సంధించింది. మీరు బకాయిలు చెల్లించరు, విద్యార్ధుల నుంచి కళాశాలలను ఫీజులు వసూలు చేయవద్దంటే వాళ్లు కాలేజీలు ఎలా నడుపుతారని ప్రశ్నించింది.

ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. బడ్జెట్ సెషన్ కూడా అయిపోయినట్టు ఉందని, ఇంతవరకు బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదని నిలదీసింది. పెండింగ్ బకాయిలు ఎప్పటి లోగా చెల్లిస్తారో తెలపాలని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు15 లోపు బకాయిలు అన్ని క్లియర్ అవుతాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. ఆ లోపు బకాయిలు క్లియర్ అయితే ఆ రోజే మా పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి.

Advertisement

Also Read: నీటి సమస్యకు.. శాశ్వత పరిష్కారం కావాలి.. తుంగభద్ర వేదికగా సీఎం రేవంత్ డిమాండ్

మరోవైపు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వానికి, కాలేజ్ యాజమాన్యాలకు మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ బకాయిల ద్వారా 2,3,4 సంవత్సరాల విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోరారు. ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 30వ తేదీకి వాయిదా పడింది.

Advertisement

Also Read: అవును.. నేను గుంపుమేస్త్రీనే..! సెల‌వు తీసుకోకుండా..తెలంగాణ కోసం శ్ర‌మిస్తున్నా!

Related News

బిగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ రెడ్డితో BRICS కల్చరల్ మీడియా ఫోరం ప్రతినిధులు భేటీ

ఆదిలాబాద్‌లో ఘోరం.. సవతుల పోరు… ఒకరు హత్యా, మరొకరు ఆత్మహత్య!

కీసర 108 సిబ్బంది చేసిన పనికి ప్రశంసల జల్లు.. ఎం చేశారంటే?

పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్.. రూ. 2.25 కోట్ల భారీ సాయం ప్రకటన!

లాల్ దర్వాజాలో అద్భుతం..అమ్మవారే స్వయంగా పసుపు చల్లి..

BIGTV ఎఫెక్ట్.. కాలుష్య కంపెనీల గుట్టురట్టు చేస్తానన్న ఎంపీ చామల!

లెక్కలు తక్కువ.. ప్రాణనష్టం ఎక్కువ! యాదాద్రి జిల్లాలో క్యాన్సర్ పంజా

కల్తీ తిని రోగాల బారిన పడుతున్నారా? కరీంనగర్ ఇంజనీర్ సూపర్ సొల్యూషన్!

Big Stories

Advertisement
×