E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి

తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి
Advertisement

Hyderabad: ఓఆర్‌ఆర్‌ లోపల ఇళ్ల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త పథకానికి పేరు కోసం ప్రజల నుంచి సూచనలు తీసుకుంటోంది. మంచి పేరు సూచించిన వారికి లక్ష రూపాయులు బహుమతి ఇవ్వనుంది. ఈ విషయాన్ని హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ స్వయంగా వెల్లడించారు.

తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి

Advertisement

రాష్ట్రం ఏర్పడిన తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు-LIG క్యూర్ ఏరియాలో లక్ష ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి మంచి పేరు కోసం సూచించాలని హౌసింగ్ బోర్డు డిసైడ్ అయ్యింది. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకానికి మంచి పేరు నేరుగా ప్రజల నుంచి స్వీకరించాలని డిసైడ్ అయ్యింది.

వచ్చిన పేర్లలో ఉత్తమమైనది ఎంపిక చేయనున్నారు. మంచి పేరు సూచించిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇవ్వనుంది. సోషల్ మీడియా వేదికగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. వివిధ వర్గాల ప్రజల సొంతింటి కలలను నెరవేర్చడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉంది.

Advertisement

క్యూర్ ఏరియాలో లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి శ్రీకారం

బోర్డు ఆధ్వర్యంలో చేపట్టి ప్రాజెక్టుకు ప్రజల నుంచి మాంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో అందులో ప్రజలను భాగస్వామ్యులను చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూన్ 28 వరకు సోషల్‌మీడియా వేదికగా పోటీ జరుగుతోంది.

హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన tghd.official పేరుతో ఇన్‌స్టా‌గ్రామ్ www.instagram.com/p/DZ6mCF_E1PY/ ఉంది. దాని ద్వారా పోటీలో పాల్గొనవచ్చు. క్యూర్ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ ఐజి ప్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. అవసరమైన భూములను గుర్తించింది ప్రభుత్వం. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించనుంది. దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ALSO READ: తెలంగాణ సీపీఎం పార్టీలో మూడు ముక్కలాట.. తెరవెనుక ఉన్న ఆ కీలక నేత..?

Related News

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?

తెలంగాణ సీపీఎం పార్టీలో మూడు ముక్కలాట.. తెరవెనుక ఉన్న ఆ కీలక నేత..?

బాసర సరస్వతిదేవి ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు దోచేశారు, తలుపు బద్దలు కొట్టి, ఆ తర్వాత

జోరుగా నైరుతి రుతుపవనాలు.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం, మూడు రోజులు అలర్ట్

తుంగభద్ర జలాలపై.. రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చేసిన మంత్రి ఉత్తమ్

మాటల్లోనే మైనార్టీ బడ్జెట్.. చేతల్లో శూన్యం.. ప్రభుత్వంపై కవిత ఫైర్!

ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు

Big Stories

×