New Pensions: తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను ఖరారు చేసింది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వీలుగా ఆదాయం, ఆస్తులు ఇంట్లోని వ్యక్తుల ఉద్యోగ స్థితికి సంబంధించిన కఠిన నిబంధనలను ప్రభుత్వం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు మించకూడదు. ఈ పరిమితి దాటితే కొత్త పింఛన్లకు అనర్హులుగా పరిగణిస్తారు. ఇక కుటుంబానికి 3 ఎకరాలకు మించి సాగు భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉంటే పింఛన్ లభించదు. అలాగే సొంతంగా ఫోర్ వీలర్స్ (కార్లు), రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు ఉన్న కుటుంబాలు కూడా అనర్హుల జాబితాలోకి వస్తాయి.
Also Read: వరదలో చిక్కుకున్న కారు.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని రక్షించిన స్థానికులు
ఇంట్లోని పిల్లలు, కుటుంబ సభ్యులు ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నా లేదా వృత్తి నిపుణులుగా ఉన్నా ఆ కుటుంబానికి పింఛన్ సదుపాయం వర్తించదు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇతర రకాల పింఛన్లు పొందుతున్న వారు కొత్త పింఛన్ దరఖాస్తులకు అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతోనే ఈ నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం కరెక్టేనా? కొత్త డేటింగ్ ట్రెండ్.. ఎథికల్ నాన్ మోనోగమీ