NRI Advisory: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీకి చెందిన 11 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఈ నెల 17 నుంచి 21 వరకు ఫిలిప్పీన్స్లో అధ్యయన పర్యటన చేపట్టనుంది. ఈ విషయాన్ని కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రతినిధి బృందంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి లతో పాటు కమిటీ సభ్యులు పాల్గొంటారు.గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం, రక్షణ కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవస్థలు, ఉత్తమ పద్ధతులను (బెస్ట్ ప్రాక్టీసెస్) ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా లోని ఇండియన్ ఎంబసీ, వివిధ వలస కార్మిక సంఘాలు, ప్రభుత్వ సంస్థలను సందర్శిస్తారు.
Aslo Read: మన దేశంలో.. మనకే అనుమతి లేని రాష్ట్రాలు.. వెళ్లాలంటే దరఖాస్తు తప్పనిసరి!
తెలంగాణ గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన, ‘గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ పర్యటన చేపట్టినట్లు వారు తెలిపారు.
Also Read: హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!