E-Paper
Advertisement

Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, కాపాడాలంటూ ప్రభాకర్‌రావు పిటిషన్

Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, కాపాడాలంటూ ప్రభాకర్‌రావు పిటిషన్
Advertisement

Telangana Phone Tapping:  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు. లేటెస్ట్‌గా ఆయన యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు చేస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అందులో పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. దీన్ని పసిగట్టిన కొంతమంది నేతలు, తెర వెనుక నుంచి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇండియాకు రాకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు.

Advertisement

ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డు దక్కించుకున్న ప్రభాకర్‌రావు, మరో అడుగు ముందు కేశారు. ఈ క్రమంలో యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో కీలక సారాంశం ఏంటంటే.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పని చేశానని ప్రస్తావించారు. రాజకీయంగా తనను అక్కడి ప్రభుత్వం వేధిస్తుందని  పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని, ఫ్లోరిడాలో తన కుమారుడి వద్ద ఉంటున్నానని రాసుకొచ్చారు.

Advertisement

ALSO READ: దూసుకెళ్తున్న హైదరాబాద్ మెట్రో.. ఆ కారిడార్‌లో రోజుకు ఏకంగా అంతమంది ప్రయాణిస్తున్నారట!

ప్రభాకర్‌రావు దరఖాస్తుపై అమెరికా ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి. లేదంటే భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందా? అనేది చూడాలి. మరోవైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావుని ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ సర్కార్.

దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖతో మంతనాలు జరుపుతోంది. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×