E-Paper
Advertisement

Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: శివధర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసు శాఖ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులకు మరోసారి శాంతి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో శాంతి, భద్రతలు బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా అడవుల్లో, సరిహద్దు ప్రాంతాల్లో గుప్తచర్యల్లో కొనసాగుతున్న క్యాడర్లు వెంటనే లొంగిపోయి సాధారణ జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన శాంతి సందేశాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ.. హింసా మార్గం సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు.

గత రెండు సంవత్సరాల్లో మొత్తం 588 మంది మావోయిస్టులు లొంగుబాటు చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. లొంగుబాటు లేదా పునరావాస విధానం ద్వారా వారికి తక్షణ ఆర్థిక సాయం.. నివాస సదుపాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు కూడా తెలంగాణలో లొంగుబాటు చేసి సాధారణ జీవితాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఇదే మార్గాన్ని అనుసరించాలని ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్న 15 మంది తెలంగాణ మావోయిస్టు క్యాడర్లకు డీజీపీ ప్రత్యేక పిలుపునిచ్చారు.

లొంగిపోతే ప్రభుత్వం అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తూ.. కుటుంబాలతో గౌరవప్రదమైన జీవితం గడపడానికి సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సమాజంలో స్వేచ్ఛతో, గౌరవంతో జీవించేందుకు అవసరమైన పునరావాస చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి, అభివృద్ధి, సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని.. అండర్‌గ్రౌండ్ జీవితం విడిచి కుటుంబాలతో కలసి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని తెలంగాణ పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Also Read:  ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×