Polytechnic: పాలిటెక్నిక్ కోర్సులను శక్తి డిపార్ట్మెంట్ కిందకు తీసుకొచ్చామని మంత్రి వివేక వెంకట్ స్వామి అన్నారు. స్కిల్ ఓరియెంటెడ్ విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. పాలిటెక్నిక్లను అప్గ్రేడ్ చేసి కొత్త కోర్సులు తీసుకొస్తామని, పాలిటెక్నిక్ విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ అందచేస్తామని మంత్రి వివేక్ తెలిపారు.
లెక్చరర్ల విధివిధానాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, డిపార్ట్మెంట్ పేరు మాత్రమే మారిందని అన్నారు. లెక్చరర్లు ఆందోళన చెందొద్దని మంత్రి క్లారిటీ ఇచ్చారు. పాలిటెక్నిక్ ఫీజు స్ట్రక్చర్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్కు వెళ్లే ప్రస్తుత విధానమే కొనసాగుతుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని వివేక్ అన్నారు.
Also Read: దాసుడి తప్పులు దండంతో సరి.. నోటీసులిస్తారు.. సారీలతో సరిపెట్టుకుంటారు.. !
పాలిటెక్నిక్ భూములు అమ్ముతారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని మంత్రి వివేక్ తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని విద్యార్ధలందరూ అలర్ట్గా ఉండాలని మంత్రి వివేక్ తెలిపారు. టామ్కామ్ ద్వారా విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు.
Also Read: ఇది న్యాయం కాదు, నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు: కొండా సురేఖ