E-Paper
Advertisement

బ్రెజిల్‌ లో E32 ఫ్యూయెల్ వాడుతున్నారు.. మరి భారత్‌లో E20పై ఎందుకింత భయం?

బ్రెజిల్‌ లో E32 ఫ్యూయెల్ వాడుతున్నారు.. మరి భారత్‌లో E20పై ఎందుకింత భయం?
Advertisement

E20 Petrol in India: భారత్‌లో E20 పెట్రోల్‌పై గత కొంతకాలంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాత కార్లు, బైకులు ఉన్న యజమానులు ఈ ఫ్యూయెల్ తో తమ వాహనాలు డ్యామేజ్ అవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మైలేజ్ తగ్గుతుందనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 50 ఏళ్లుగా ఇథనాల్ ఫ్యూయెల్ ను ఉపయోగిస్తున్న బ్రెజిల్ అనుభవం భారత్‌కు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెబుతోంది.

E20పై భయాలు ఎందుకు?

E20 అంటే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం. దీనిలో శక్తి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే, అసలు ఆందోళన మైలేజ్ గురించి కాదు. E20కు ప్రత్యేకంగా రూపొందించని పాత కార్లు, బైకుల్లో ఫ్యూయల్ సిస్టమ్ దెబ్బతింటుందా? అన్నదే పెద్ద ప్రశ్న. ఇక్కడే బ్రెజిల్ ఉదాహరణ ఉపయోగపడుతుంది. ఆ దేశం 1970ల నుంచే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను ఉపయోగిస్తోంది. అక్కడ ప్రారంభంలోనే E20ను ప్రవేశపెట్టి, తర్వాత మిశ్రమ శాతాన్ని క్రమంగా పెంచారు. ఇప్పుడు అక్కడ E32 వరకు మిశ్రమ ఇంధనం అందుబాటులో ఉంది.

పాత కార్లకు నిజంగా నష్టం జరిగిందా?

Advertisement

బ్రెజిల్‌లో అప్పటి కార్లు నేటి వాహనాల కంటే చాలా పాత టెక్నాలజీతో పనిచేసేవి. కార్బ్యురేటర్లు, పాత రబ్బరు హోసులు, సాధారణ గాస్కెట్లు ఉండేవి. అయినప్పటికీ E20 కారణంగా భారీ స్థాయిలో ఇంజిన్ సమస్యలు వచ్చాయని స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు. ఇథనాల్‌తో సంబంధం ఉన్న కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ, అవి ఎక్కువగా E100 వంటి స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడిచే ప్రత్యేక వాహనాల్లో కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పాత రబ్బరు భాగాలు, హోసులు, ఓ-రింగులు కాలక్రమేణా త్వరగా దెబ్బతినే అవకాశం మాత్రం ఉంది.

భారత్ లో E10 కార్ల సంగతేంటి?

E10 కాలంలో తయారైన కార్లను E20తో నడిపితే వెంటనే పెద్ద నష్టం జరుగుతుందని చెప్పడానికి ప్రస్తుతం స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే, దీర్ఘకాలంలో కొన్ని పాత రబ్బరు భాగాల జీవితకాలం తగ్గే అవకాశం ఉందని నిపుణులు పూర్తిగా తోసిపుచ్చడం లేదు. ముఖ్యంగా ఫ్యూయల్ హోసులు, గాస్కెట్లు, ఓ రింగులు లాంటి చవకైన భాగాలపై ప్రభావం ఉండవచ్చు. కానీ, ఇంజిన్‌లోని ప్రధాన లోహ భాగాలు, పంపులు, వాల్వులు లేదా ఇంజెక్టర్లకు నేరుగా భారీ నష్టం జరుగుతుందనే ఆధారాలు లేవు.

అసలు సమస్య ఏంటి?

Advertisement

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. సమస్య కేవలం ఇథనాల్ శాతమే కాకపోవచ్చు. ఇంధనంలో క్లోరైడ్ వంటి కలుషితాలు ఉంటే అవి ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, వాల్వులు లాంటి భాగాలను తుప్పు పట్టించే ప్రమాదం ఉంది. అంటే E20ని తప్పుబట్టడం కంటే, పెట్రోల్ నాణ్యత సరైన ప్రమాణాల్లో ఉందా? లేదా? అన్నది పరిశీలించడం చాలా ముఖ్యం. బ్రెజిల్ అనుభవం కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. బ్రెజిల్ 50 ఏళ్ల అనుభవం ప్రకారం, E20 వల్ల ప్రతి పాత కారు, బైక్ వెంటనే పాడైపోతుందని అనుకోవడం తప్పు. అయితే దీర్ఘకాలిక ప్రభావాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. వాహనాన్ని సకాలంలో సర్వీస్ చేయించడం, ఫ్యూయల్ సిస్టమ్‌ను పరిశీలించడం చేస్తే ఎలాంటి సమస్యలు రావు.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 679 కిమీ రేంజ్.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా XEV 9S!

Tags

Related News

యాక్సర్ నుంచి కాస్ట్లీ హెల్మెట్ లాంఛ్, ధర ఎంతో తెలుసా?

సింగిల్ ఛార్జ్ తో 520 కి.మీ రేంజ్.. BYD క్రేజీ సీలయన్ 7 వచ్చేసింది!

లగ్జరీ కార్లే టార్గెట్.. వీళ్లు కొట్టేసే ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

హ్యుందాయ్ మళ్లీ బాదుడు.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?

సింగిల్ ఛార్జ్ తో 679 కిమీ రేంజ్.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా XEV 9S!

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×