E-Paper
Advertisement

Weather Update: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో అయితే భారీ వానలు, బయటకు వెళ్లొద్దు

Weather Update: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో అయితే భారీ వానలు, బయటకు వెళ్లొద్దు

Weather Update: గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం బలపడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు రాత్రంతా భారీగా వర్షాలు ఛాన్స్ ఉందని వివరించంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చారు.

ఇవాళ ఈ జిల్లాలో వర్షం దంచుడే దంచుడు…

ఈ రోజు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో చెల్లాచెదరుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వివరించింది. ఇక హైదరాబాద్ లో మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ALSO READ: Junior Associate Jobs: ఎస్బీఐలో 6589 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు.. భారీ వేతనం, మరి ఇంకెందుకు ఆలస్యం

మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం…

మరి కాసేపట్లో జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మోస్తారు పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు.

ALSO READ: NIACL Jobs: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.96వేల జీతం, ఇదే మంచి అవకాశం

ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి నది…

భారీవర్షాలకు తెలంగాణలో ములుగు జిల్లాలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. వాజేడు మండలంలోని పేరూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరింది. టేకుల గూడెం వద్ద జాతీయ రహదారి లో లెవెల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పలు చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో తెలంగణ- ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. బొగత జలపాతంలోకి దిగకుండా సందర్శనకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. వెంకటాపురంలోని పాలెం ప్రాజెక్టుకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 3600 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేశారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×