E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?

ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?
Advertisement

Telangana SCERT: తెలంగాణలో ఉపాధ్యాయ శిక్షణ కరదీపికలు, ట్రైనర్స్ ప్యాకేజీల తయారీ కోసం ఈనెల 29 నుంచి జూలై 1 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీ వేదికగా ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌నకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఎంపిక చేసిన రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు హాజరుకావాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Also Read: సింగపూర్ ‘వధువు’.. హైదరాబాద్ ‘వరుడు’.. కట్ చేస్తే రూ.కోటిన్నర హాంఫట్!

Advertisement

తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఉర్దూ, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగాలకు చెందిన నిపుణులను ఇందుకోసం నియమించినట్లు పేర్కొన్నారు. సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు తమ జిల్లాల పరిధిలోని రిసోర్స్ పర్సన్లను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఎంపికైన ప్రతినిధులు జూన్ 29వ తేదీ ఉదయం 9 గంటల కల్లా తమ సొంత ల్యాప్‌టాప్‌లతో వర్క్‌షాప్‌నకు తప్పనిసరిగా హాజరుకావాలని డైరెక్టర్ స్పష్టం చేశారు.

Also Read: అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

Related News

ఆర్‌ఎస్‌పీ ప్రాణాలకే ప్రమాదమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

తుంగభద్ర నీటిపై రేవంత్ రెడ్డికి బీజేపీ షాక్.. ఆ 15.9 టీఎంసీల కథేంటి?

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు!

ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు.. హరీష్ రావు వ్యాఖ్యలపై కూనంనేని సాంబశివరావు ఫైర్!

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత.. 12 గ్రామాల్లో ‘SIR’ ప్రక్రియ బహిష్కరణ!

మెగా డీఎస్సీ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఫైర్!

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీగా, 42శాతం లోటు వర్షపాతం

Big Stories

×