E-Paper
Advertisement

Telangana Man Dies In Desert: సౌదీ అరేబియా ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి.. ఫోన్ సిగ్నల్ లేక తీవ్ర ఎండకు..

Telangana Man Dies In Desert: సౌదీ అరేబియా ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి.. ఫోన్ సిగ్నల్ లేక తీవ్ర ఎండకు..
Advertisement

Telangana Man Dies In Desert| తెలంగాణకు చెందిన ఓ యువకుడు గల్ఫ్ దేశంలోని ఎడారిలో దారితప్పి నిస్సహాయ స్థితిలో చనిపోయాడు. 650 కిలోమీర్ల పాటు విస్తీర్ణంగా ఉన్న ఎడారిలో తన స్నేహితుడితో వెళ్లి అక్కడ దారితప్పిపోయాడు. ఆ తరువాత ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో.. సిగ్నల్ కోసం వెతుకుతూ మరింత వ్యతిరేక దిశలో వెళ్లిపోయాడు. చివరికి రోజుల తరబడి నీరు కూడా లేక తీవ్ర ఎండకు ఇద్దరూ చనిపోయారు. ఈ విషాద ఘటన సౌదీ అరేబియా దేశంలోని రుబా అల్ ఖాలీ ఎడారిలో జరగింది.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రాంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల మొహమ్మద్ షెహ్‌జాద్ ఖాన్ సౌదీ అరేబియా దేశానికి ఉద్యోగం కోసం 2021 సంవత్సరంలో వెళ్లాడు. అక్కడ ఒక టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగ నిమిత్తం.. అతను తరుచూ మొబైల్ టవర్ల వద్ద రిపేర్లు, సుదూర ప్రాంతాల్లో కొత్త టవర్ల ఏర్పాటు కోసం కారులో వెళుతుంటాడు.

Advertisement

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

ఈ క్రమంలో కొన్ని రోజుల ముందు షెహ్ జాద్ ఖాన్, తనతో పాటు పనిచేస్తున్న సడాన్ దేశస్తుడుతో కలిసి రుబా అల్ ఖాలీ ఎడారి సమీపంలోకి వెళ్లాడు. అయితే వెళ్లిన ప్రదేశంలో ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో తన అధికారులతో మాట్లాడడానికి ఎడారి చుట్టూ కారులో తిరుగుతూ దారి తప్పిపోయాడు. చివరికి ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయింది.

Advertisement

సహాయం కోసం కారులో తిరిగి తిరిగి.. పెట్రోల్ కూడా అయిపోయింది. దీంతో ఎడారిలో కాలినడకన అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర ఎండకు నీరసించిపోయాడు. తనతో పాటు ఉన్న స్నేహితుడు కూడా ఓపిక నశించి కారు సమీపంలోనే ఉండిపోయాడు. చివరికి సహాయం కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ.. నమాజు చేసే మ్యాట్ పై ఇద్దరూ ప్రాణాలు వదిలారు.

Also Read: Man Marries sister: వధువు చేయి చూసి పెళ్లి ఆపేసిన వరుడి తల్లి.. ఏం జరిగిందంటే..

అయితే షెహ్ జాద్, అతని మిత్రుడి కోసం వారి కంపెనీ వారు వెతుకుతూ.. నాలుగు రోజుల తరువాత వారి కారు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ హృదయ విదారక దృశ్యం చూసి చలించిపోయారు.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

ఇలాంటిదే మరొక ఘటనలో ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్లిన దుర్గేశ్ అనే భారతీయ యువకుడికి అతని యజమాని దొంగచాటుగా కతార్ తీసుకెళ్లాడు. అక్కడ దుర్గేశ్ తో బానిసలా పనిచేయించేవాడు. దీంతో దుర్గేశ్ తప్పించుకొని ఇండియన్ ఎంబసీకి చేరుకొని ఫిర్యాదు చేశాడు. అక్కడ ఇండియన్ ఎంబసీ వారు సౌదీ అరేబియా ప్రభుత్వానికి సమాచారం అందించగా.. అధికారులు దుర్గేశ్ ను కాపాడి భారత దేశానికి సురక్షితంగా పంపించారు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

 

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×