BigTV English
Advertisement

TG Assembly Sessions: చేతగాకనా.. సబ్జెక్ట్ లేకనా.. బీఆర్ఎస్ కు ఇన్ని తిప్పలా?

TG Assembly Sessions: చేతగాకనా.. సబ్జెక్ట్ లేకనా.. బీఆర్ఎస్ కు ఇన్ని తిప్పలా?

TG Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలంటే చాలు.. బీఆర్ఎస్ కు ఏం చేయాలో తోచని పరిస్థితి ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎలాగోలా మీడియాలో కనిపించాలి, ఆ తర్వాత అసెంబ్లీకి డుమ్మా కొట్టాలి. ఇదేనా బీఆర్ఎస్ నైజం అంటున్నారు నెటిజన్స్. ప్రశ్నించేందుకు సబ్జెక్ట్ లేకనో ఏమో కానీ, పాత చింతకాయ పచ్చడి విషయాలతో బీఆర్ఎస్ రావడం, కాంగ్రెస్ తిప్పికొట్టడం ఇదే పనిగా మారింది.


మొన్నటికి మొన్న అసెంబ్లీ తొలి సమావేశం రోజు, టీషర్ట్స్ పై అదానీ, సీఎం రేవంత్ రెడ్డి బొమ్మతో వచ్చిన బీఆర్ఎస్ నేతలు పోలీసులు అనుమతించక పోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే నేటి సమావేశాల్లో కూడా రైతుకు సంకెళ్ల పేరిట ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి వాకౌట్ చేసి పలాయనం చిత్తగించారు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు.

తొలి అసెంబ్లీ రోజు అదానీకి సీఎం రేవంత్ రెడ్డికి అనుబంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ఊదరగొట్టారు. అది కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ నిర్మాణానికి అదానీ రూ. 100 కోట్ల నిధులను విరాళంగా ఇచ్చిన సమయంలో తీసిన ఫోటోతో. అప్పుడే నెటిజన్స్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఆ 100 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి వద్దన్న విషయాన్ని కూడా మరచి, బీఆర్ఎస్ విషప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ లీడర్స్ కూడా తిప్పికొట్టారు.


నేడు మాత్రం ఏకంగా లగచర్ల రైతుకు సంకెళ్లు అంటూ.. బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. మొన్నటికి మొన్న రైతుకు సంకెళ్లు వేసిన ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆరోగ్యం బాగా లేకున్నా, సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటూ సీఎంఓ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది.

Also Read: Jamili Elections: జమిలీ కోసం.. కమిలి పోతున్న పార్టీలు.. ఆశలు గల్లంతేనా?

కానీ ఇవేమి పట్టని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు సబ్జెక్ట్ లేకనో ఏమో కానీ, ఏ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్న కుదరని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలు, మరోవైపు రాష్ట్రఅభివృద్దికి ప్రభుత్వం పాటుపడుతుంటే, బీఆర్ఎస్ నోట మాటలు లేవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నందుకు ఏదోకటి అడగాలిగా.. అందుకే పాపం బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు తిప్పలు తప్పలేదని నెటిజన్స్ అంటున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు కాస్త ఆలోచించి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

Related News

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Big Stories

×