E-Paper
Advertisement

Theft in mortuary : శవాలను కూడా వదలరా? మార్చురీలోనూ.. ఇంత దారుణమా?

Theft in mortuary : శవాలను కూడా వదలరా? మార్చురీలోనూ.. ఇంత దారుణమా?

Theft in mortuary : కొన్ని ఘటనలు మానవత్వానికే మచ్చ తెస్తుంటాయి. వీళ్లు మనుషులేనా.? అనేలా చేస్తుంటాయి. అలాంటి ఘటనే జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. సాటి మనిషి చనిపోయిందన్న కనీస కనికరం లేని కొందరు.. శవం దగ్గర సైతం దొంగతానికి పాల్పడ్డారు. అదేమంటే.. మాకేం తెలుసంటూ దబాయించారు. దాంతో.. కూతురు చనిపోయిందని బాధపడాలో, ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నామని భయపడాలో తెలియని స్థితిలో.. లబోదిబోమంటున్నారు.. బాధిత కుటుంబసభ్యులు.

గద్వాల్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ లో గురువారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో మెరిస్సా అనే మహిళ మృతి తీవ్రంగా గాయపడి మరణించింది. దాంతో.. ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. నివ్వెరపోయే విషయాన్ని గమనించారు. ప్రయాణ సమయంలో ఆమె ధరించిన బంగారం, మార్చురీకి తీసుకువచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది.

దాంతో అవ్వాకైన మహిళ కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ సిబ్బందిని అడిగారు. సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్న మార్చురీ సిబ్బంది.. మీరే తీసారేమోనంటూ దబాయించారు. ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు అడిగినా.. సమాధానమివ్వలేదని మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు వాపోయారు. అసలే మా కూతురు చనిపోయిందన్న దుఃఖంలో ఉన్న తమకు.. మృతదేహంపై ఉన్న బంగారు దొంగిలించడం మరింత బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మానవ విలువలు లేకుండా ఇలా చేయడం.. ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : 16 ఏళ్ల స్టూడెంట్‌ని కిడ్నాప్ చేసిన మహిళా టీచర్.. లింగమార్పిడి చేసుకొని పెళ్లికోసం..

పోస్టుమార్టం సమయంలోనూ మృతదేహంపై బంగారం ఉన్నట్లు వివరాలు అందించామని చెబుతున్న బాధిత కుటుంబ సభ్యులు.. సుమారు తులం బంగారు అపహరించారి వాపోతున్నారు. సంబంధిత మార్చురీ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×