E-Paper
Advertisement

Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!

Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!
Advertisement

Keesara Crime: ఏ హానీ జరగకుండా చూసుకోవాల్సిన వారే ఆ చిన్నారి పాలిట రాక్షసులయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వరుసకు అన్నలయ్యే ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది చూసి మందలించాల్సిన మేనమామ కూడా అత్యాచారం జరిపాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్​ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

6వ తరగతి చిన్నారి..

కీసర ప్రాంతానికి చెందిన బాధిత చిన్నారి తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు సంతానం. చిన్న భార్యకు ఓ కూతురు ఉంది. ఆ బాలిక యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ హాస్టల్​ లో ఉంటూ 6వ తరగతి చదువుతోంది. ఇటీవలే సెలవుల కోసం ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేనపుడు వరుసకు అన్నలయ్యే ఇద్దరు ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది చూసిన మేనమామ అడ్డుకుని వారికి బుద్ది చెప్పాల్సింది పోయి తాను కూడా అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి బాధితురాలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతూ వస్తోంది.

Advertisement

Also read: బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

పరార్‌లో ఇద్దరు..

చివరకు పక్కింట్లో ఉంటున్న వారికి జరిగిన విషయం చెప్పింది. వారి ద్వారా విషయం తెలిసి బాధితురాలి కుటుంబ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి నిందితుల్లో ఒకన్ని అరెస్ట్​ చేసినట్టు సీఐ ఆంజనేయులు తెలిపారు. మిగితా ఇద్దరు నిందితులు మహారాష్ట్రకు పారిపోయినట్టుగా తెలిసిందన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించి నింబోలిఅడ్డలోని బాలికల జువెనైల్​ హోంకు తరలించారు.

Advertisement

Also read: దిగొచ్చిన మోదీ సర్కార్! సిజెపి షరతులన్నింటికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Related News

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. అసెంబ్లీకి ఇద్దరు సీనియర్ నేతలు దూరం?

సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపు అప్డేట్.. సీఎం హమీ?

సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. శామీర్‌పేట్‌లో భారీగా ర్యాలీ!

Big Stories

Advertisement
×