President Rule: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య కేసీఆర్పై చేసిన అమానవీయ వ్యాఖ్యలపై ఏసిపికి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాజయ్య మండిపడ్డారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యపై ఏసిపికి తాటికొండ రాజయ్య ఫిర్యాదు చేశారు. అతనిపై కేసు నమోదు చేయాలని ఏసిపికి ఫిర్యాదు చేసానని తెలిపారు. కేసిఆర్ పై చేసిన వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్టంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు.
Also read: సర్ జాబితా ప్రక్షాళనలో గందరగోళం.. విచారణలతో వృద్ధులకు తప్పని తిప్పలు!
బిజెపి సభ్యులను ఫ్లకార్డులతో అసెంబ్లీలోకి ఎలా అనుమతించారు రాజయ్య ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని దీంతో తెలంగాణలో రాష్టపతి పాలన విదించాలని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.