E-Paper
Advertisement

Thummala Nageswara Rao : సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం.. 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు..

Thummala Nageswara Rao : సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం.. 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు..

Thummala Nageswara Rao : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Sita Rama Lift Irrigation Project ) తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద జరుగుతున్న టన్నెల్‌ పనులను బుధవారం మంత్రి పరిశీలించారు.

అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్‌ ప్రధానమైనదని పేర్కొన్నారు. పనులను రెండు వైపుల నుంచి చేసుకుంటూ రావాలని చెప్పారు. మోడ్రన్ టెక్నాలజీని వినియోగించి పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. టన్నెల్ పనులు పూర్తయితే బేతుపల్లి, లంకాసాగర్‌కు నీళ్లు అందుతాయని స్పష్టం చేశారు. గండుగులపల్లిలో నాలుగో పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి యాతాలకుంట టన్నెల్ ప్రధానమైనదని పేర్కొన్నారు. టన్నెల్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×