E-Paper
Advertisement

TPCC: కొత్త చీఫ్ వస్తే.. కమిటీలు కామనే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

TPCC: కొత్త చీఫ్ వస్తే.. కమిటీలు కామనే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

– మా పాలన నచ్చే ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు
– హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తాం
– ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది మేమే
– ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ లేదు
– టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
– కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ప్రత్యేక భేటీ

Congress: ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒకవేళ ఎన్నికలు జరిగినా అవి తమ ఖాతాలోనే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు మహేష్ కుమార్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఖర్గే ఆశీర్వాదం కోసం కలిశానని అన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మహా నేత అని, అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారని చెప్పారు. అధిష్టానం సూచనలతో అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా పనిచేస్తానని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తానని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి, పార్టీ పెద్దల చేతిలో ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్.

Also Read: Arekapudi Gandhi Vs Kaushik Reddy: వీధికెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్,కేటీఆర్ మౌనమేలా?

పీసీసీ అధ్యక్షుడు మారిన తర్వాత ప్రతీసారి కొత్త కమిటీలు ఏర్పడుతాయని చెప్పారు. కొత్త కమిటీల విషయంలో ఏఐసీసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కమిటీలు ఏర్పాటు చేస్తానన్న పీసీసీ చీఫ్, ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయ ప్రత్యామ్నాయాలు చూస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా పార్టీ మార్పులపై నడుచుకుంటామని, పార్టీ విధానాలు, పాలన చూసి కొందరు నేతలు వస్తే చేర్చుకున్నామని వివరించారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ నేతలు లేరని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వారికి సున్నా స్థానాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకనే నేతలు తమ వైపు చూస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్న మహేష్ కుమార్, ఒకవేళ జరిగినా గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×