E-Paper
Advertisement

BRS: ఇద్దరు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం..

BRS: ఇద్దరు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం..
Advertisement

BRS (Telangana News) : ఖమ్మ జిల్లా వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం జరిగింది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గుడిసెపై తారాజువ్వ పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. పేలుడు ధాటికి పలువురు కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఘటనాస్థలి రక్తసిక్తంగా మారింది.

ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. సిలిండర్ పేలుడికి, బాణాసంచాకు సంబంధం లేదని నామా స్పష్టం చేశారు. ఎండ వేడికి సిలిండర్ పేలినట్లుగా భావిస్తున్నట్లుగా చెప్పారు. ఏదైనా జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అవసరమైతే గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తామన్నారు.

Advertisement

ప్రమాదంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పార్టీ పరంగా ఆదుకుంటామన్నారు.

Related News

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

కాంట్రాక్టర్ యమ సేఫ్ ప్లాన్.. ఏసీబీకి చిక్కిన అధికారి.. ఎలా చిక్కారంటే..?

సునీల్ గవాస్కర్ నుంచి నేను నేర్చుకున్నది ఇదే.. అజహరుద్దీన్ సక్సెస్ మంత్ర!

గవర్నర్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బిగ్ అప్డేట్.. సూచనలు చేస్తానని హమీ!

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాలేదా? మీ డబ్బు ఇలా వాపస్

మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్

రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

Big Stories

Advertisement
×