E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్  నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు
Advertisement

Hyderabad: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారిని నిరోధించడం వీరి ప్రధాన బాధ్యత. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోనుంది ప్రభుత్వం. ఇక రాత్రి వేళ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కూడా వారి సేవలు వినియోగించుకోనుంది.

Advertisement

తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, అలాగే ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను రూపొందించనుంది. వీలైనంత త్వరగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులకు అదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ట్రాన్స్‌జెండర్లపై ఫోకస్ చేసింది. సమాజంలో గౌరవప్రదంగా వారు జీవించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వారి ఆరోగ్య సేవలు అందించేందుకు మైత్రి క్లినిక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.

Advertisement

ALSO READ:  సురేష్ మా పార్టీ కార్య‌క‌ర్తే.. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

నార్మల్‌గా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ట్రాన్స్‌జెండర్లు మాత్రం వైద్యం చేయించుకునేందుకు ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. వారికి వైద్యం చేయడానికి డాక్టర్లు సైతం ఆలోచిస్తారు.

ప్రభుత్వ ఆసుపత్రిల్లో మైత్రి పేరిట విభాగాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ సేవలను అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నారు. వారానికి రెండురోజులు మాత్రమే ఓపీ సేవలు అందించనున్నారు. అది ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×