E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్  నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు
Advertisement

Hyderabad: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారిని నిరోధించడం వీరి ప్రధాన బాధ్యత. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోనుంది ప్రభుత్వం. ఇక రాత్రి వేళ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కూడా వారి సేవలు వినియోగించుకోనుంది.

Advertisement

తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, అలాగే ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను రూపొందించనుంది. వీలైనంత త్వరగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులకు అదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ట్రాన్స్‌జెండర్లపై ఫోకస్ చేసింది. సమాజంలో గౌరవప్రదంగా వారు జీవించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వారి ఆరోగ్య సేవలు అందించేందుకు మైత్రి క్లినిక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.

Advertisement

ALSO READ:  సురేష్ మా పార్టీ కార్య‌క‌ర్తే.. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

నార్మల్‌గా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ట్రాన్స్‌జెండర్లు మాత్రం వైద్యం చేయించుకునేందుకు ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. వారికి వైద్యం చేయడానికి డాక్టర్లు సైతం ఆలోచిస్తారు.

ప్రభుత్వ ఆసుపత్రిల్లో మైత్రి పేరిట విభాగాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ సేవలను అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నారు. వారానికి రెండురోజులు మాత్రమే ఓపీ సేవలు అందించనున్నారు. అది ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×