BigTV English

Two die after bike rams bus: చందానగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Two die after bike rams bus: చందానగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Advertisement

Two die after bike rams bus: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనగర్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.


రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారు చందానగర్ వాసులుగా గుర్తించారు. మృతులు మనోజ్, రాజులు అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


చందానగర్ కు చెందిన గొలుసు మనోజ్(23), చిట్టిమల్ల రాజు(26) ఇద్దరూ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై వెళ్తున్నారు. అయితే చందానగర్ జీఎస్ఎం మాల్ సమీపంలో యూటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు.

బైక్ నడుపుతున్న మనోజ్ తోపాటు రాజు ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Related News

Supreme Court: సుప్రీంపై సర్కారు ఆశలు.. రిజర్వేషన్లపై రేవంత్ ప్రయత్నాలు ఫలిస్తాయా!

Hyderabad: 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్..

Konda Surekha: మా అమ్మనే అరెస్ట్ చేస్తారా..? రాత్రి కొండ సురేఖ ఇంటి వద్ద ఏం జరిగిందంటే..

Trolling On Ktr: మానవత్వం, కాకరకాయ.. కేటీఆర్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్

Hyderabad: మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి నగర బహిష్కరణ.. రాచకొండ పోలీసు కమిషనర్ నోటీస్ జారీ

Sridhar Babu: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం.. దేశంలోనే ఏకైక మంత్రిగా..

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బైపోల్.. ఈ తేదీల్లో ఎగ్జిట్ పోల్స్ నిషేదం, ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

Etala Rajender: ఈటలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి షాకింగ్ న్యూస్.. ఒక్కొక్కరిపై రూ.2 కోట్ల పరువు నష్టం దావా?

Big Stories

×