E-Paper
Advertisement

Two die after bike rams bus: చందానగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Two die after bike rams bus: చందానగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Advertisement

Two die after bike rams bus: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనగర్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

ఈ ప్రమాదంలో చనిపోయిన వారు చందానగర్ వాసులుగా గుర్తించారు. మృతులు మనోజ్, రాజులు అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చందానగర్ కు చెందిన గొలుసు మనోజ్(23), చిట్టిమల్ల రాజు(26) ఇద్దరూ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై వెళ్తున్నారు. అయితే చందానగర్ జీఎస్ఎం మాల్ సమీపంలో యూటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు.

Advertisement

బైక్ నడుపుతున్న మనోజ్ తోపాటు రాజు ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×