Jubilee by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా కొనసాగుతోంది. తొలి రౌండ్లో నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన పోరులో, రెండో రౌండ్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
మొదటి రౌండ్లో ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా కనిపించగా, రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 18,617 ఓట్లు పోలయ్యాయి. ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 17,473 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి 307 ఓట్లు సాధించారు. ఈ రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొత్తం 1,144 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.
కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఫలితాల ప్రకటనలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ అప్డేట్లను ఎప్పటికప్పుడు సరిగా వెల్లడించడం లేదని మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ, వారంతా ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, సకాలంలో ఫలితాలను ప్రకటించాలని కోరుకుంటున్నారు.
ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. గుండెపోటుతో అభ్యర్థి మృతి