E-Paper
Advertisement

Kishan Reddy: బీఆర్ఎస్ గెలవడానికి కాదు.. డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం చేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy: బీఆర్ఎస్ గెలవడానికి కాదు.. డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం చేయాలి: కిషన్ రెడ్డి
Advertisement

Kishan Reddy Comments On BRS(Telangana politics): రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి 5 నెలలు అయినా సరే ఓటమిని ఒప్పుకోలేకపోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.

కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది బీజేపీనే.. ఈ విషయం కేటీఆర్ కు గుర్తులేదా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన గులాబీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

కుమార్తె లిక్కర్ మాఫియా కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బీఆర్ఎస్ ఓట్లు అడుగుతోంది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో బీఆర్ఎస్ గెలవడానికి కాదు.. డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం అయోమయంలో ఉందన్నారు.

గ్యారంటీల పేర్లతో గారడీలు చేసి రేవంత్ రెడ్డి ఓట్లు దండుకున్నారుని ఆరోపించారు. ఇప్పుడేమో ఆగస్టు 15 కల్లా హామీలను అమలు చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు చేయనిది.. ఆ వెంటనే గ్యారెంటీలని అమలు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆగస్టు 15 తర్వాత ప్రజలకు మొండిచేయి చూపిస్తారన్నారు. ఎన్నికల కోడ్ అయిపోగానే రుణమాఫీ చేయొచ్చు కదా.. దానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించారు.

Advertisement

Also Read: ‘ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు’

దేశంలోనూ, రాష్ట్రంలోనూ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందువరుసలో ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించిన ఐదు సభల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ, అభ్యర్థులను ప్రకటించడంలోనూ బీజేపీ అందరికంటే ముందు ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×