E-Paper
Advertisement

Vande Bharat: వందేభారత్ ట్రైన్‌పై మరోసారి రాళ్లదాడి

Vande Bharat: వందేభారత్ ట్రైన్‌పై మరోసారి రాళ్లదాడి
Advertisement

Vande Bharat: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సికింద్రాబాద్-విశాఖ మధ్య ఓ ట్రైన్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ ట్రైన్‌పై తరచుగా ఆకతాయిలు రాళ్లతో దాడులు చేయడం కలకలం రేపుతోంది.

ఇటీవల విశాఖలో కొందరు ఆకతాయిలు ట్రైన్‌పై రాళ్లు విసరడంతో.. అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు తిరిగి కొత్త అద్దాలను అమర్చారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగింది.

Advertisement

ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. మహబూబాబాద్-గార్ల మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో బోగి అద్ధాలు ధ్వంసమయ్యాయి. సీ-8 కోచ్‌లోని 41, 42, 43 వద్ద ఉన్న అద్దం పగిలిపోయింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×