BigTV English
Advertisement

Vande Bharat: వందేభారత్ ట్రైన్‌పై మరోసారి రాళ్లదాడి

Vande Bharat: వందేభారత్ ట్రైన్‌పై మరోసారి రాళ్లదాడి

Vande Bharat: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సికింద్రాబాద్-విశాఖ మధ్య ఓ ట్రైన్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ ట్రైన్‌పై తరచుగా ఆకతాయిలు రాళ్లతో దాడులు చేయడం కలకలం రేపుతోంది.


ఇటీవల విశాఖలో కొందరు ఆకతాయిలు ట్రైన్‌పై రాళ్లు విసరడంతో.. అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు తిరిగి కొత్త అద్దాలను అమర్చారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగింది.

ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. మహబూబాబాద్-గార్ల మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో బోగి అద్ధాలు ధ్వంసమయ్యాయి. సీ-8 కోచ్‌లోని 41, 42, 43 వద్ద ఉన్న అద్దం పగిలిపోయింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


Related News

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jagan Tour: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా.. రైతులకు ఇంతకంటే అవమానం ఉంటుందా?

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Big Stories

×