Urea Booking: యూరియా యాప్తో ఈ నెల 14 వరకు 12.73లక్షల మంది రైతులు 50.48లక్షల యూరియా సంచులు బుక్ చేసుకున్నారని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తెలిపారు. అందులో 46.13లక్షల సంచులు రైతులు ఇప్పటికే కొనుగోలు చేశారని అన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సవరణలు చేస్తూ యూరియా యాప్ అమలు చేస్తున్నామన్నారు.
యాప్ అమలును ఉన్నతస్థాయి అధికారుల నుంచి పీల్డ్ స్థాయి అధికారుల వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, పీల్డ్లో ఎదురయ్యే సమస్యలను సమీక్షిస్తున్నామన్నారు. తొలుత 5 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించామన్నారు. పీల్డ్ స్థాయి అవసరాల మేరకు అనేక ప్రాంతాల్లో మండలాన్ని యూనిట్ గా నిర్ణయించి దీంతో రైతులకు యూరియా సరఫరాపై మరింత భరోసా కల్పించామన్నారు.
Also Read: Basit Ali: ఓ దేవుడా ఇవాళ వర్షం పడేలా చూడు..ఇండియా చేతిలో ఓడిపోకుండా కాపాడు సామీ
రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండలో 1,66,704 మంది రైతులు ఉన్నారని, 7,58,949 యూరియా సంచులు బుక్ చేసుకోగా, 7,45,183 సంచులు కొనుగోలు చేశారన్నారు. జగిత్యాలో 1,38,469 మంది రైతులు 5,08,884 బస్తాలు బుక్ చేసుకోగా 5,08,884 బస్తాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. అతి తక్కువగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3192 బస్తాలు బుక్ చేసుకోగా 2390 బస్తాలు కొనుగోలు చేసినట్లు వివరించారు.
Also Read: Keerthi Suresh : ఎర్ర చీరలో మెరిసిపోతున్న కీర్తి.. ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే..