Marriage Fraud: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు ఓ మహిళ ధర్నా కలకం రేపింది. సర్పంచ్ తనను మోసం చేశాడు అంటూ బాధితురాలి ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు సర్పంచ్, ఆర్ఎంపీ డాక్టర్పై కేసు నమోదు చేశారు. ప్రస్థుతం వీరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మహిళను పెళ్లి పేరుతో 10 ఏళ్లుగా మోసం చేశాడని భాదితులరాలు ఆరోపణలు చేసింది. ఎడపల్లి మండలం ఇల్లపల్లి ఫారం సర్పంచ్ షేక్ దస్తగిర్పై ఈ ఆరోపణలు చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చెడగొట్టి విడాకులు ఇప్పించాడని బాధితురాలి ఆరోపిస్తున్నారు. తానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని మహిళ ఆరోపించారు. బోధన్లో గత 6 ఏళ్లుగా ఇద్దరం కలిసి సహజీవనం చేశామని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేశారు.
మహళను గర్భవతిని చేసి సర్పంచ్ షేక్ అబార్షన్ చేయించాడని ఆరోపణలు చేసింది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో అక్రమ వైద్యం జరిగిందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. షేక్ సర్పంచ్గా గెలిచిన తర్వాత పెళ్లికి నిరాకరించాడని బాధితురాలు తెలిపింది. నాకు న్యాయం చేయాలని మీడియా, అధికారుల ముందు భాదిత మహిళ వేడుకున్నారు. ఈ సంఘటనపై కేసే నమెదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!