BigTV English
Advertisement

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

IRCTC Singapore – Malaysia Tour Package:

భారతీయ రైల్వే చక్కటి టూర్ ప్యాకేజీలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇండియాతో పాటు విదేశాల్లోనూ పర్యటించే అవకాశం కల్పిస్తుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు పర్యాటకులకు విదేశాల్లో ఎంజాయ్ చేసే ప్రత్యేక అవకాశాన్నిఅందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే సింగపూర్-మలేషియా టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. అక్టోబర్ 27న ప్రారంభమయ్యే ఈ టూర్ 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. వెంటనే ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.


జైపూర్ నుంచి టూర్ ప్రారంభం

IRCTC అందిస్తున్న సింగపూర్-మలేషియా టూర్ ప్యాకేజీ జైపూర్ నుంచి ప్రారంభం అవుతుంది. 7 రోజుల పర్యటన అక్టోబర్ 27న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా జైపూర్ నుండి విమాన ప్రయాణం, 3 స్టార్ హోటళ్లలో వసతి, వీసా ఫీజులు, భారతీయ రెస్టారెంట్లలో భోజనం, AC డీలక్స్ బస్సులలో సందర్శనా స్థలాలు,  ఎంట్రీ ఫీజులు, టూర్ గై, ప్రయాణ బీమా అందిస్తుంది.

టూర్ ప్యాకేజీ ఛార్జ్ ఎంత ఉంటుందంటే?

సింగపూర్- మలేషియా టూర్ ప్యాకేజీ ధర కూడా మిడిల్ క్లాస్ కు అందుబాటులోనే ఉన్నట్లు IRCTC ప్రకటించింది. డబుల్ ఆక్యుపెన్సీపై ఒక్కో వ్యక్తికి రూ.1,25,085 ఛార్జ్ వసూలు చేస్తున్నారు. 5% TCS పన్ను వాపసు తర్వాత ఒక్కో వ్యక్తికి రూ. 1,18,820కి తగ్గనుంది. IRCTC వెబ్‌ సైట్‌ లో లేదంటే జైపూర్‌లోని వారి ప్రాంతీయ కార్యాలయంలో బుకింగ్‌లు చేసుకోవచ్చు. ఇప్పటికే పర్యాటకుల నుంచి మంచి ఈ టూర్ కు మంచి స్పందన వస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.


సింగపూర్- మలేషియా టూర్ ప్యాకేజీ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?

సింగపూర్- మలేషియా టూర్ ప్యాకేజీ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు IRCTC వెబ్‌ సైట్ www.irctctourism.comలో లేదంటే జైపూర్‌లోని IRCTC ప్రాంతీయ కార్యాలయాన్ని (708, 7వ అంతస్తు, క్రిస్టల్ మాల్, బానిపార్క్, కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో) సందర్శించి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి సమాచారం, సహాయం కోసం 8595930997, 9001094705 వాట్సాప్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

Read Also:  ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

కరోనా తర్వాత తగ్గిన విదేశీ ప్రయాణాలు

నిజానికి కోవిడ్-19 మహమ్మారి తర్వాత అంతర్జాతీయ పర్యాటకం చాలా కాలంగా నిలిపివేయబడింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో, ప్రజలు మళ్ళీ విదేశీ టూర్ ప్యాకేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే IRCTC కూడా చక్కటి టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. తక్కువ ధరల్లో విదేశాలకు వెళ్లి రావాలనుకునే వారికి మంచి అవకాశం కల్పిస్తోంది.

Read Also: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Related News

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

Big Stories

×