E-Paper
Advertisement

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?
Advertisement

Indian Railway:

కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీ ధరలు తగ్గించిన నేపథ్యంలో ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా జీఎస్టీ సవరణలకు అనుగుణంగా ధరలను తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అందులో భాగంగా రైళ్లలో IRCTC అందించే రైల్ నీర్(వాటర్ బాటిల్) ధరలను తగ్గించింది. దేశ వ్యాప్తంగా ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

తగ్గిన రైల్ నీర్(వాటర్ బాటిల్) ధర  

ఇకపై రైళ్లలో లభించే రైల్ నీర్ వాటర్ బాటిళ్ల ధర గతంతో పోల్చితే మరింత చౌకగా లభించనుంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా  నీటి ధరలను తగ్గిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. GST తగ్గింపు నుంచి వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చడానికి, రైల్ నీర్ వాటర్ బాటిళ్ల గరిష్ట అమ్మకపు ధరను 1 లీటరుకు రూ. 15 నుంచి రూ. 14 కు తగ్గించినట్లు తెలిపింది. అటు అర లీటర్ వాటర్ బాటిల్ ధర రూ. 10 నుంచి రూ. 9కి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ప్రకటన జారీ చేసింది. ఈ ధరల తగ్గింపు ఈ నెల(సెప్టెంబర్ 22) నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.

Advertisement

Read Also: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

రైల్వే ప్రయాణీకుల సంతోషం

Advertisement

అటు భారతీయ రైల్వే వాటర్ బాటిళ్ల ధరలను తగ్గించాలని నిర్ణయించడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర సేవలపైనా ధరలు తగ్గించాలని కోరుతున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో అమ్మే వస్తువులకు సంబంధించి కచ్చితంగా ఎమ్మార్పీని పాటించాలని రైల్వే సూచించింది. ఎక్కువ ధరలకు విక్రయించే దుకాణదారులు, వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. రైల్వే నిబంధనలకు కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.

Read Also:  ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×