E-Paper
Advertisement

Amrabad Tiger Reserve closure: ఆ అడవికి తాళం.. ఆ రూట్ లో వెళ్లవద్దు.. వెళ్లారంటే?

Amrabad Tiger Reserve closure: ఆ అడవికి తాళం.. ఆ రూట్ లో వెళ్లవద్దు.. వెళ్లారంటే?
Advertisement

Amrabad Tiger Reserve closure: తెలంగాణ అచ్చంపేట ప్రాంతంలో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కి తాత్కాలికంగా తాళం పడింది. వన్యప్రాణుల రక్షణ, వర్షాకాల భద్రతా చర్యల నిమిత్తంగా ఈ అద్భుత అడవి 3 నెలలపాటు పర్యాటకులకు పూర్తిగా మూసివేయబడింది. జూలై 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు ఈ మూసివేత కొనసాగనుంది. ఈ సమయంలో అడవిలోకి ఎవరూ ప్రవేశించరాదు. పర్యాటకుల కోసం కాదు, పులుల కోసం ఈ విరామం అంటున్నారు అటవీ శాఖాధికారులు.

తెలంగాణ రాష్ట్రంలోని అచ్చంపేట వద్ద ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పర్యాటకులకు తెలిసిన ప్రసిద్ధ అడవి పర్యాటన గమ్యం మాత్రమే కాదు, ఎన్నో వన్యప్రాణులకు నివాసంగా నిలుస్తోంది. ఈ అడవుల్లో పులులు, చిరుతలు, సాంబార్ జింకలు, అడవి మేకలు, ఎన్నో పక్షులు సహజంగా నివసిస్తున్నాయి. అయితే ఈ అడవులు కొంతకాలం విముక్తమవ్వాలంటే కొన్ని ప్రత్యేక కాలాల్లో వాటిని మూసివేయడం అవసరం. ఈ దిశగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) మార్గదర్శకాలను అనుసరిస్తూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో జూలై 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు పర్యాటకులకు తాత్కాలికంగా తాళం వేస్తున్నట్టు అటవీ శాఖ ప్రకటించింది.

Advertisement

ఎందుకు మూసివేస్తున్నారు?
వర్షాకాలం వన్యప్రాణుల జీవనవిధానంలో ఎంతో కీలకమైన సమయం. ఈ కాలంలో పులులు, ఇతర జంతువులు జతకట్టి పిల్లల్ని కనడం, వాటిని రక్షించడం, సురక్షితమైన వాతావరణంలో జీవించడం అవసరం. తలచుకుంటే మనిషి ప్రశాంతంగా ఉండేందుకు ఓ స్థలం కావాలనుకుంటాడు కదా.. అచ్చం అదే భావనతో ఈ అడవిని కొంతకాలం పర్యాటకుల నుంచి దూరంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా కోర్ జోన్ అనే పులుల ముఖ్య నివాస ప్రాంతాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా చూడడం ప్రధాన ఉద్దేశం.

భద్రతా కారణాలు ఒక కారణమే!
వర్షాకాలంలో అడవుల్లో మార్గాలు తడిసిపోతాయి. కొండ ప్రాంతాల్లో నేల తడిగా మారి పర్యాటకులకు ప్రమాదంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న వానపాటు కూడా కొండల మధ్య గుట్టల్లో నీటిని పేరుకుని ముంచెత్తే ప్రమాదం ఉంది. ఇటువంటి సందర్భాల్లో పర్యాటకులే కాకుండా అడవీ సిబ్బందికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ఈ సమయంలో అడవిని మూసివేయడం వల్ల అందరి క్షేమం కాపాడినట్టే అవుతుంది.

Advertisement

Also Read: Tirupati darshan trains: తిరుపతికి 16 స్పెషల్ ట్రైన్స్.. ఏపీ మొత్తం చుట్టేస్తాయి.. బుక్ చేసుకున్నారా?

పునరుద్ధరణకు ఇది ఒక అవకాశమే
వర్షాల ప్రభావంతో అడవిలోని ట్రెయిల్స్, గెస్ట్ హౌస్‌లు, గైడ్ మార్గాలు, గుర్తింపు బోర్డులు మొదలైనవి దెబ్బతినే అవకాశముంటుంది. ఇవన్నీ తిరిగి సిద్ధం చేయడానికి కొంత సమయం అవసరం. పైగా రాబోయే పర్యాటక సీజన్‌కు ముందే అడవిని సుందరంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ఇది బంగారు అవకాశం అని చెప్పొచ్చు.

అటవీ ప్రేమికులకు విజ్ఞప్తి
అటవీ శాఖ అధికారులు పేర్కొన్న ప్రకారం, వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న ఈ చర్యలను అర్థం చేసుకుని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ప్రయాణాలు అక్టోబర్ 1, 2025 తర్వాతకు మళ్లించండి. అప్పటికి అడవి తిరిగి పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందని అటవీశాఖ అధికారి ప్రకటనలో తెలిపారు.

పర్యావరణ సమతుల్యతకు ముందడుగు
అడవులను కాపాడాలంటే ఒక మానవ బాధ్యతగా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. పులుల వృద్ది, ఇతర వన్యప్రాణుల సంరక్షణ, ప్రకృతి సమతుల్యత వంటి అంశాలన్నీ మన భవిష్యత్తుతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రభుత్వ విధానాలకు మద్దతు పలకడం ద్వారా మనం పరోక్షంగా ప్రకృతి రక్షణకు తోడ్పడినట్లే.

వన్యప్రాణులకు శాంతంగా జీవించే అవకాశం కల్పించాలంటే అతి ముఖ్యమైన మార్గం.. అవి నివసించే ప్రదేశాన్ని కొంతకాలం ప్రశాంతంగా ఉంచడం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పర్యాటక మూసివేతను ఆ కోణంలో చూడాలి. ఇది మనకెంతమాత్రం అసౌకర్యంగా అనిపించినా, అది వన్యప్రాణుల కోణంలో ఎంతో అవసరం. ప్రకృతిని ప్రేమించేవారు.. ఈ మూసివేతను ఆశీర్వదించాల్సిందే!

Related News

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!

రైల్వే స్టేషన్ లో చిప్స్ ప్యాకెట్స్ ఎత్తు కెళ్లిన ప్రయాణికులు.. ఏం చిల్లర గాళ్లు ఉన్నారేంట్రా మీరూ?

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

Big Stories

Advertisement
×