E-Paper
Advertisement

Indian Railways: గుడ్‌న్యూస్.. ఇప్పుడు చివరి నిమిషంలో కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

Indian Railways: గుడ్‌న్యూస్.. ఇప్పుడు చివరి నిమిషంలో కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?
Advertisement

Indian Railways: ప్రపంచంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేసేది కూడా భారతదేశ రైల్వేలోనే. ఇండియన్ రైల్వేలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. రవాణా ఛార్జీలు తక్కువగా ఉన్న కారణంగా చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువగా రైలులోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే ఎక్కడికైనా రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మామూలుగా ఇండియన్ రైల్వే విధానంలో ట్రైన్ టికెట్లను 2 నెలలు ముందు గానే బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. తత్కాల్ టికెట్, ప్రయాణానికి ఒక రోజు ముందు బుక్ చేసుకోవచ్చు. అదే కొన్ని గంటల ముందు రైలు ప్రయాణం చేయాల్సి వస్తే టికెట్‌ బుకింగ్‌ చేసుకోవడం కష్టమైన పనే. అయితే ఇప్పుడు రైలు బయలుదేరడానికి నిమిషం ముందు కూడా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఓసారి చూద్దాం.

Advertisement

ALSO READ: BHEL Recruitment: డిగ్రీ అర్హతతో భెల్‌లో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..

అయితే, చివరి నిమిషంలో ట్రైన్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ ట్రైన్ టికెట్లను చివరి నిమిషంలో కానీ.. రైలు బయలుదేరే ముందు కానీ బుక్ చేసుకోవచ్చు. రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్, వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఈ ట్రైన్ టికెట్ బుకింగ్ విధానంలో చార్టింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు లేదా బెర్త్ లను మళ్లీ అందుబాటులోకి తెస్తారు. ట్రైన్ ప్రారంభమయ్యే అరగంట ముందు వరకు ప్రయాణికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఇలాంటి టికెట్ బుకింగ్స్ పై పది శాతం వరకు తగ్గింపు ఇచ్చేవారు. అయితే 2023 నుంచి జనరల్ రిజర్వేషన్ల కోసం వసూలు చేసిన ఛార్జీలే.. ఈ టికెట్ రిజర్వేషన్ కు కూడా వసూలు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.50,000.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..

ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా ఈ టికెట్లను ఎలా బుక్ చేయాలో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం..

1. ముందుగా యాప్ లోకి లాగిన్ అవ్వాలి.. ఆ తర్వాత మీరు వెళ్లే గమ్య స్థానాన్ని ఎంటర్ చేయాలి.

2. మీరు ఈ టికెట్ బుక్ చేసేటప్పుడు బుకింగ్ డేట్ ను నమోదు చేయాలి. అంటే అదే రోజును నమోదు చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఫిబ్రవరి 28, 2025న టికెట్ కావాలంటే అదే ప్రయాణ తేదీని ఎంటర్ చేయాలి. స

3. అప్పుడు ఆ రూట్ లో అందుబాటులో ఉన్న రైళ్ల జాబితాను చూపిస్తుంది. కావాల్సిన క్లాస్ లేదా కంపార్ట్ మెంట్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

4. అప్పుడు టిక్కెట్ కరెంట్ అవైలబుల్ గా కనిపిస్తాయి. అప్పడు ఈజీ గా టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ALSO READ: Group-D Jobs: 32000 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే మిత్రమా.. ఆలస్యం వద్దు..!

రద్దీ తక్కువ ఉండే మార్గాల్లో ఈ టికెట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కరెంట్ బుకింగ్ ఆన్ లైన్ లో మాత్రమే చేయవచ్చని ప్రయాణికులు గమనించాలి. అంతే కాకుండా బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి. ప్రయాణికులు ఈ టికెట్లను ఉపయోగించి బుక్ చేసిన టికెట్ల కోసం బోర్డింగ్ పాయింట్ ను మార్చలేరు.

Related News

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×