E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ప్రయాణికుడికి ఇచ్చిన బిర్యానీలో ఈగ.. రైల్వే క్యాటరింగ్ సంస్థకు షాక్!

ప్రయాణికుడికి ఇచ్చిన బిర్యానీలో ఈగ.. రైల్వే క్యాటరింగ్ సంస్థకు షాక్!
Advertisement

Rajdhani Express Food Row: రైల్లో ప్రయాణికులకు నాసిరకం భోజనం అందించడంపై ఐఆర్‌సీటీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రీసెంట్ గా రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో ఓ ప్రయాణికుడికి అందించిన వెజ్ బిర్యానీలో ఈగ కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై స్పందించిన ఐఆర్‌సీటీసీ సంబంధిత క్యాటరింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. భారీగా జరిమానా విధించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

అహ్మదాబాద్‌-ముంబై తేజస్ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మధ్యాహ్న భోజనం కోసం వెజ్ బిర్యానీని ఆర్డర్ చేశారు. భోజనం చేస్తుండగా ఆయనకు బిర్యానీలో ఈగ కనిపించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రయాణికుడు వెంటనే ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రైలు కెప్టెన్, క్యాటరింగ్ మేనేజర్ ప్రయాణికుడి దగ్గరికి చేరుకుని జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బంది ప్రయాణికుడికి క్షమాపణలు చెబుతూ, మరో భోజనం అందిస్తామని సూచించారు. అయితే, ఆ ప్రయాణికుడు వారి ప్రతిపాదనను తిరస్కరించారు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు.

క్యాటరింగ్ సంస్థకు రూ. 1 లక్ష జరిమానా

Advertisement

ఈ ఘటనను ఐఆర్‌సీటీసీ చాలా సీరియస్‌ గా తీసుకుంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన బాధ్యత క్యాటరింగ్ సంస్థలపై ఉందని తేల్చి చెప్పింది. ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించడంలో ఫెయిల్ అయిన సంబంధిత క్యాటరింగ్ సంస్థ అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌ కు రూ.1 లక్ష జరిమానా విధించింది. అంతేకాకుండా, సంస్థ నిర్వహిస్తున్న మెస్ లైసెన్స్‌ ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. సూరత్‌ లోని మెయిన్ కిచెన్ నుంచి ఈ సంస్థ రాజధాని ఎక్స్‌ ప్రెస్ ప్రయాణికులకు భోజనాలను సరఫరా చేస్తోంది. అయితే, ఈ ఘటనతో ఆ సంస్థ ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైల్వే అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, క్వాలిటీ లేని ఆహారం అందించే సంస్థల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చి చెప్పారు. ఇటీవల రైళ్లలో అందించే భోజన నాణ్యతపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికులు కూడా భోజనం సరిగా లేకపోతే వెంటనే ఐఆర్‌సీటీసీ హెల్ప్‌ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో రైల్వే క్యాటరింగ్ సేవల్లో మరింత కట్టుదిట్టమైన తనిఖీలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Read Also: IRCTC సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా.. రైల్వే శాఖ ఆమోదం!

Related News

ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ రెడీ.. చెన్నై స్టార్టప్ సంచలనం!

IRCTC సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా.. రైల్వే శాఖ ఆమోదం!

భోగాపురం విమానశ్రయం.. ఇది చాలా కాస్ట్‌లీ గురూ.. ప్రయాణికులకు చుక్కలే!

ఏ నేరం చేయకుండానే జైలుకు వెళ్లొచ్చు.. చంచల్‌గూడ జైలులో చిప్పకూడు తినే ఛాన్స్!

బుల్లెట్ రైళ్లు సాధారణ పట్టాలపై వెళ్లలేవా? ప్రత్యేక ట్రాక్‌లు ఎందుకు నిర్మిస్తారు?

అలా జరిగితే.. వందే భారత్‌ రైలులో ఫుడ్ ఫ్రీ, రైల్వే కీలక నిర్ణయం!

జపాన్ టూర్‌కు IRCTC స్పెషల్ ప్యాకేజీ.. బుల్లెట్ రైలు ప్రయాణంతో 10 రోజుల టూర్!

Big Stories

×