E-Paper
Advertisement

Condor Airlines plane: విమానంలో మంటలు.. పేలిన ఇంజిన్, 273 మంది ప్రయాణికులు

Condor Airlines plane:  విమానంలో మంటలు.. పేలిన ఇంజిన్, 273 మంది ప్రయాణికులు
Advertisement

Condor Airlines plane: ఈ మధ్యకాలం తరచూ విమాన ప్రమాదాలు, చిన్న చిన్న ఘటనలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితి గమనించి పైలట్ వెంటనే ఎమర్జెన్సీగా ఇటలీలో ల్యాండ్ చేశారు. అసలేం జరిగింది.

Advertisement

Advertisement

 గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న కాండోర్ బోయింగ్ విమానంలో ప్రమాదం జరిగింది. విమానం భూమి నుంచి 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 273 మంది ప్రయాణికులు ఉన్నారు. కుడివైపు ఇంజిన్‌లో టెక్నికల్ సమస్యలు వెంటాడాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ శబ్దం వినిపించింది.

పరిస్థితి గమనించిన పైలట్ విమానాన్ని ఇటలీలోని బ్రిండిసి ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కేవలం ఒక ఇంజిన్‌తో సురక్షితంగా సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. పైలట్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ప్రయాణికులు, నెటిజన్లు ప్రశంసించారు.

విమానం కిటికీలో బడి ఆ సన్నివేశాన్ని చూసిన ప్రయాణికులు సిబ్బంది అలర్ట్ చేశారు. ఈ విమానం గ్రీస్‌లోని కోర్ఫు ద్వీపం నుంచి వెళ్తుండగా పర్యాటకులు ఈ సన్నివేశాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. దీనికి సంబంధించి దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. విమానం అత్యవసరంగా ల్యాండ్ కాగా, అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ALSO READ: దీపావళి టికెట్లకు ఫుల్ డిమాండ్.. బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లో

ప్రయాణికులను సేఫ్‌గా కిందకు దించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటన తర్వాత కాండర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన చేసింది. ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమని తెలిపింది. జరిగిన ఘటన నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యానికి క్షమాపణలు కోరింది ఆ సంస్థ.

మరుసటి రోజు ప్రయాణికులను జర్మనీకి ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇదిలాఉండగా విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో హోటల్ రూమ్స్ లేవు. దీంతో గంటల కొద్దీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఉండిపోయారు. కొద్దిగంటల తర్వాత అప్పుడు ప్రయాణికులను హోటళ్లకు తరలించారు.

ఈ ఘటన నేపథ్యంలో బోయింగ్ విమానాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎందుకు తరచూ ప్రమాదాల బారినపడుతున్నాయి? సరిగా మెయింటెనెన్స్ లేకపోవడమే కారణమా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత తరచూ ప్రపంచంలో ఏదో ఒక చోటు విమానలకు సంబంధించి రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. దీంతో విమానం ఎక్కే ప్రయాణికులు కాస్త భయపడుతున్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి ఘటనలు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఏదో విమానంలో జరిగిందని, అన్ని విమానాలపై అనుమానం పడడం కరెక్టుకాదని అంటున్నారు.

 

 

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×