E-Paper
Advertisement

India’s Rail Milestone: ఇండియన్ రైల్వేలో హిస్టారికల్ మైల్ స్టోన్.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లింక్ చివరి ట్రాక్ కంప్లీట్!

India’s Rail Milestone: ఇండియన్ రైల్వేలో హిస్టారికల్ మైల్ స్టోన్.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లింక్ చివరి ట్రాక్ కంప్లీట్!

Udhampur-Srinagar-Baramulla Rail Link: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ఫైనల్ ట్రాక్ నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భారతీయ రైల్వేలో ఇదో చారిత్రాత్మక మైల్ స్టోన్ గా అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కాశ్మీర్, దేశంలోని ఇతర ప్రాంతాలు మధ్య నేరుగా రైల్వే కనెక్షన్ ని మెరుగు పర్చాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో కీలకమైన దశ పూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. “ఇదో చారిత్రక మైలురాయి. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌ చివరి ట్రాక్ పనులు పూర్తయ్యాయి. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం దిగువన కట్రా నుంచి రియాసికి అనుసంధానం చేసే 3.2 కి.మీ పొడవైన టన్నెల్ T-33 కోసం బ్యాలస్ట్-లెస్ ట్రాక్ వర్క్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది” అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

జనవరిలో న్యూఢిల్లీ-కాశ్మీర్ డైరెక్ట్ రైలు ప్రారంభం

దేశంలోని రైల్వే కనెక్షన్లలో ముఖ్యమైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ మీదుగా జనవరి 2025లో న్యూఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు నేరుగా వెళ్లే రైలు ప్రారంభం కానుంది. వందే భారత్ మూడవ వెర్షన్ అయిన స్లీపర్ రైలు ఈ రూట్ లో తొలిసారి అందుబాటులోకి రానుంది. న్యూఢిల్లీ-శ్రీనగర్ వందేభారత్ స్లీపర్ రైలు 800 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 13 గంటల్లో చేరుకోనుంది. వచ్చే నెలలో రియాసి- కత్రా మధ్య 272 కిలో మీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టుకు సంబంధించి  చివరి 17 కిలో మీటర్లను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. USBRL ప్రాజెక్ట్‌ ద్వారా కాశ్మీర్, ఢిల్లీ మధ్య నేరుగా వందే భారత్ రైళ్లు ప్రారంభించడం వల్ల దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈ ప్రాంతానికి కనెక్టివిటీ మెరుగుపడనుంది. లాజిస్టికల్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఆర్థిక విస్తరణనకు ఉపయోగపడనుంది. ఈ రైల్వే లింక్ ద్వారా ఢిల్లీ, శ్రీనగర్‌లను కలుపుతూ ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాకు చేరుకోవచ్చు.  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి కూడా ఈ మార్గంలోనే భాగంగా ఉంటుంది.

ఢిల్లీ-శ్రీనగర్ రైల్వే మార్గం గురించి..

పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1995లో USBRL ప్రాజెక్టును రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాథమికంగా మంజూరు చేశారు. ఆ తర్వాత 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఈ లింక్ నిర్మాణం. 2009 వరకు బారాముల్లా-ఖాజిగుండ్ మధ్య 118 కిలోమీటర్ల విస్తరణ పూర్తయింది. 2013లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ లింక్ ను బనిహాల్ వరకు పొడిగించారు. 2014లో ఉదంపూర్-కత్రా సెగ్మెంట్ ప్రారంభించబడింది. 2023లో బనిహాల్-సంగల్దాన్ నడుమ లింక్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 35,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

న్యూఢిల్లీ-కాశ్మీర్ వందేభారత్ స్లీపర్ రైలు టికెట్ల ధరలు

న్యూఢిల్లీ- కాశ్మీర్ వరకు సుమారు 800 కిలో మీటర్ల దూరాన్ని వందేభారత్  స్లీపర్ రైలు 13 గంటల్లో చేరుకోనుంది.  ఈ రైలు న్యూఢిల్లీ నుంచి సాయంత్రం 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఇక ఈ రైలుకు సంబంధించి టికెట్ల ధర విషయాని వస్తే.. AC 3 టైర్ (3A) టికెట్ ధర సుమారు రూ. 2,000 ఉంటుంది.  టూ-టైర్ AC (2A) టికెట్ ధర దాదాపు  రూ. 2,500 ఉంటుంది. AC క్లాస్ I (1A) ధర దాదాపు రూ.  3,000 ఉంటుంది.

Read Also: టికెట్లతోనే కాదు.. క్యాన్సలేషన్‌తో కూడా డబ్బులే డబ్బులు.. ఎంత వస్తుందంటే?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×