E-Paper
Advertisement

Hyderabad Traffic Rule: సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశారో అంతే సంగతులు, సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

Hyderabad Traffic Rule: సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశారో అంతే సంగతులు, సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

Hyderabad CP Sajjanar Mass Warning:

ఈ రోజుల్లో చాలా మంది టాక్సీ డ్రైవర్లు డ్యూటీలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, యూట్యూబ్ వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. కొంత మంది ఏకంగా సోషల్ మీడియాలో రీల్స్ ట్యాప్ చేస్తూ వెళ్తున్నారు. సెల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక చర్యలు చేపడుతున్నారు. ఇకపై మోబైల్ యూజ్ చేస్తూ వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

సీపీ సజ్జనార్ కీలక సూచనలు

రోడ్డు మీద వాహనాలు నడిపే సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు తమతో పాటు తోటి ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమైనదని గుర్తించాలన్నారు. “ఆటో రిక్షా, క్యాబ్/బైక్ టాక్సీ డ్రైవర్లతో సహా చాలా మంది డ్రైవింగ్ చేస్తూ తరచుగా వీడియోలు చూడటం,  ఇయర్‌ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. శిక్షార్హమైన నేరం. ఇకపై ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. తమతో పాటు రోడ్డు మీద వెళ్లే వాహనదారుల భద్రత కూడా చాలా ముఖ్యమైనది భావించాలి. పరధ్యానంలో ఉండి వాహనాలు నడపకూడదు. ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని వాహనదారులు గుర్తించాలి. ఇకపై ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా ఉండాలి” అని పోస్టు పెట్టారు.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న ట్యాక్సీ డ్రైవర్లు

చాలా మంది ఆటో డ్రైవర్లు, బైక్ టాక్సీ రైడర్లు ప్రయాణీకులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లేటప్పుడు రీల్స్, యూట్యూబ్ కంటెంట్ చూడటానికి తమ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. కొంతమంది డ్రైవర్లు నిరంతరం ఇయర్‌ ఫోన్స్ పెట్టుకుని ఫోన్‌ లో మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు కాల్స్ కు సమాధానం చెప్తూ  ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణీకులు తమ భద్రత విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. అయినప్పటికీ, అలాంటి డ్రైవర్లపై ఎటువంటి కచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదు. అక్టోబర్ 4న లక్డీకా పుల్ నుంచి బంజారా హిల్స్‌ కు బైక్ రైడ్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తి రైడ్ సమయంలో బైక్ రైడర్ తన మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తున్నట్లు గమనించాడు. సదరు ప్రయాణీకుడు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, రైడర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ తాజా హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించేలా అవసరం అయితే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడబోరని సజ్జనార్ హెచ్చరించారు.

Read Also: టికెట్ లేదు, పైగా దబాయింపు.. నెట్టింట టీచర్ వీడియో వైరల్!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×