E-Paper
Advertisement

Indian Railways Record: 4.5 గంటల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డు!

Indian Railways Record: 4.5 గంటల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డు!

Indian Railway: భారతీయ రైల్వే రోజు రోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి, సరికొత్త రైళ్లను అదుబాటులోకి తీసుకొస్తోంది. అదే సమయంలో రైళ్ల వేగం మరింత పెరిగేలా తగిన మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే తాజాగా కేవలం 4.5 గంటల్లో సబ్ వేను నిర్మించి సరికొత్త రికార్డును సృష్టించింది.

పెందుర్తి- కొత్తవలస మధ్య  సబ్ వే నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌ లోని పెందుర్తి- కొత్తవలస మధ్య  ఈ సబ్‌ వేను నిర్మించింది. దేశంలోని అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన బ్రిడ్జిగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు కొనసాగాయి. “రైళ్ల వేగాన్ని పెంచేందుకు, ప్యాసింజర్లు అవాంతరాలు లేని ప్రయాణ అనుభవాన్ని పొందేందుకు తగిన మౌలికి సదుపాయాలను పెంచుతున్నాం. అందులో భాగంగానే పెందుర్తి- కొత్తవలస మధ్యలో కొద్ది గంటల్లోనే సబ్ వే నిర్మించాం. పరిమిత ఎత్తులో నిర్మించిన ఈ సబ్ వేలో 1.5 మీటర్ల వెడల్పు గల 20 భాగాలు ఉన్నాయి.  బాక్స్ పరిమాణం 4.65 మీ X 3.65 మీ. ఈ 20 విభాగాలను కలిపి కేవలం నాలుగున్నర గంటల్లోనే సబ్ వే అందుబాటులోకి తీసుకొచ్చాం” అని విశాఖపట్నంలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECR) అధికారులు వెల్లడించారు.

సబ్ వే నిర్మాణంలో పాల్గొన్న 300 మంది సిబ్బంది

ఇక ఈ సబ్ వే నిర్మాణంలో 16 హెవీ డ్యూటీ ఎక్స్‌ కవేటర్లు, 3 క్రేన్లు, 5 టిప్పర్లు, 4 హైడ్రా మెషీన్లు, హెవీవెయిట్ జాక్‌ లు, 1,000 ఇసుక బస్తాలను ఉపయోగించారు. 300 మంది రైల్వే సిబ్బంది ఈ సబ్ వే నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అయ్యారు. ముందుగా బ్లాక్ ప్రారంభమైన తర్వాత, ట్రాక్‌ లు తొలగించారు. సబ్ వే రెండు చివర్ల నుంచి మట్టి పని మొదలు పెట్టారు. క్రేన్‌ ల సహాయంతో ముందుగా తయారు చేసిన కాంక్రీట్ బాక్స్ లను బేస్ స్లాబ్‌ లను క్రమ పద్దతిలో అమర్చారు. ఎర్త్‌ వర్క్ తో పాటు భూమిని చదును చేయానికి 1 గంట సమయం పట్టింది.  బాక్స్ ప్లేస్‌ మెంట్, ట్రాక్ లింకింగ్  కు 1.5 గంటలు పట్టింది.  మొత్తం నిర్మాణ బ్లాక్‌ ను కేవలం 4.5 గంటల్లో నిర్మించారు రైల్వే అధికారులు.

Read Also: చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, IRCTC అదిరిపోయే టూర్ ప్లాన్ రెడీ!

సుమారు 6 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేత

అటు రైల్వే సబ్ వే నిర్మాణం కారణంగా రైల్వే అధికారులు సుమారు 6 గంటల పాటు పెందుర్తి- కొత్తవలస మధ్య  మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఈ సబ్ వే నిర్మాణం కారణంగా మనుషులతో కూడిన లెవల్ క్రాసింగ్ క్లోజ్ అయ్యింది. ఫలితంగా భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైళ్ల రాకపోకలతో పాటు వాహనాలు వెళ్లనున్నాయి. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ సబ్ వేను నిర్మించారు రైల్వే అధికారులు.

Read Also: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్.. ఇండియాలోనే నెంబర్ 1గా ఎలా ఎదిగింది?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×