Indian Railways tea price: ట్రైన్ ప్రయాణంలో చాయ్ తాగకపోతే ఏదో మిస్సయ్యిందన్న భావన కలుగుతుంది. ఈ మాట ఏ రైల్వే ప్రయాణికుడిని అడిగినా ఇట్టే చెబుతారు. చల్లని ఉదయాల్లో, సరదా సాయంత్రాల్లో, కిటికీ దాటే రైలు మార్గాల మధ్య ఓ వేడి చాయ్ – ఆ అనుభూతి చెప్పడం కష్టం. ఇప్పుడు ఆ అనుభూతిని మరింత సరసమైన ధరకు అందించేందుకు ఇండియన్ రైల్వే ఒక చక్కని నిర్ణయం తీసుకుంది.
ఇండియన్ రైల్వే మరోసారి సాధారణ ప్రయాణికుల హృదయాన్ని గెలుచుకునే నిర్ణయం తీసుకుంది. ట్రైన్ ప్రయాణంలో చాయ్ తాగడం అనేది ఎంతోమందికి ఒక మధురమైన అనుభూతి. అలాంటి అనుభూతిని మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఇప్పుడు రైల్వే తీసుకున్న కొత్త నిర్ణయంతో సాధ్యమైంది. ఇకపై మీరు ట్రైన్లో కూర్చుని ఉండగా లేదా స్టేషన్ వద్ద ఉన్నప్పుడు కూడా కేవలం రూ.5కి ఒక వేడి చాయ్ను ఆస్వాదించవచ్చు. ఇది 150 మిల్లీలీటర్ల సామర్థ్యం గల సాధారణ టీ కాగా, 110 మిల్లీలీటర్ల సామర్థ్యంతో కూడిన డిస్పోజబుల్ కప్పులో లభిస్తుంది.
ఇంతటి తక్కువ ధరలో, ప్రత్యేకమైన హైజీన్తో చాయ్ అందించడం ఒక పెద్ద ప్రయోజనమే. మరోవైపు, ప్రత్యేకంగా టీ బ్యాగ్తో కూడిన టీను ఆస్వాదించాలనుకునే వారికి రూ.10కి అదే పరిమాణంలో టీ కూడా లభించనుంది. ప్రయాణికుల కోసం Savour the Sip అనే ప్రచారాన్ని ప్రారంభించిన ఇండియన్ రైల్వే, స్టేషన్ అయినా, ట్రైన్ అయినా, చాయ్ ఆగకూడదనే ట్యాగ్లైన్తో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. ఒక వేడి కప్పు చాయ్ మనకు ఇవ్వగల తృప్తి మాటల్లో చెప్పలేం. ట్రైన్ కిటికీ పక్కన కూర్చుని, వెలుతురు జారుతున్న మార్గాలను చూస్తూ చాయ్ తాగడమే ఓ ప్రయాణపు రసాయనం.
Also Read: India Zambia minerals: తెగ త్రవ్వేస్తున్న భారత శాస్త్రవేత్తలు.. ఆ సంపద విలువ కోట్లలోనే!
ఇందులో ప్రత్యేకత ఏమంటే – ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు కేవలం రూ. 5 లేదా రూ. 10 ఖర్చుపెట్టి చాయ్ తాగొచ్చు. ఇది రోజూ ప్రయాణించే ఉద్యోగులు, ఫ్యామిలీలతో ప్రయాణించే వారు, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణించేవారి కోసం గొప్ప ఆఫర్. ఇంతకు ముందు ఇలా తక్కువ ధరకు హైజీనిక్ టీ అందుబాటులో ఉండడం అరుదు. దీనివల్ల చాయ్ విక్రేతలకు స్పష్టమైన ధరలు ఉండేలా చేసారు. ప్రయాణికులు మోసపోవడం తగ్గుతుంది. అదేవిధంగా ప్రయాణ సమయంలో వచ్చిన చిన్న అలసటను చాయ్ తాగి తగ్గించుకునే అవకాశం కలుగుతుంది.
ఈ చర్య ఇతర ప్రయాణ సేవల సంస్థలకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఇండియన్ రైల్వే తీసుకున్న ఈ చిన్న కాన్సెప్ట్ పెద్ద స్పందనను తెచ్చిపెట్టనుంది. చాయ్కి మోజు ఉన్న భారత్ ప్రజల మనసుల్లో ఇది ప్రత్యేక స్థానం పొందడం ఖాయం. ట్రైన్ ప్రయాణంలో ఇకపై చాయ్ కోసం ఎక్కువ ధరలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రయాణికుడికీ, ఒక చిన్న వేడి కప్పు చాయ్తో పాటు, ఒక తీపి అనుభూతి కూడా లభిస్తుంది. ఈ చిన్న కాన్సెప్ట్ గొప్ప మార్పు తేచింది. ఇకపై ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రతిసారీ, ఓ చాయ్ ఇవ్వండి అన్నా! అన్న మాట వినిపించనుంది. రూ. 5 లేదా రూ. 10… అంతే! ప్రయాణాన్ని ఆస్వాదించండి, చాయ్ను గట్టిగా ముద్దాడండి.