E-Paper
Advertisement

Vizag Special Trains: ఫెస్టివల్ రష్.. విశాఖ ప్రత్యేక రైళ్లు పొడిగింపు!

Vizag Special Trains: ఫెస్టివల్ రష్.. విశాఖ ప్రత్యేక రైళ్లు పొడిగింపు!

Indian Railways Special Trains: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు రైల్వే అధికారులు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక రైలు సేవలను సెప్టెంబర్ చివరి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ముఖ్యంగా విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం (08547/08548),  విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం (08579/08580) ప్రత్యేక రైళ్లను ప్రయాణీకుల సౌలభ్యం కోసం పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు.

ప్రత్యేక రైళ్ల పొడిగింపు ఎప్పటి వరకు అంటే?

⦿ విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్  రైలు

విశాఖపట్నం – తిరుపతి వీక్లీ స్పెషల్(రైలు నంబర్ 08547) రైలు సేవలను ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 24 వరకు (సుమారు ఎనిమిది ట్రిప్పులు) పొడిగించారు. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది.  మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి – విశాఖపట్నం (08548) వీక్లీ స్పెషల్ రైలు సర్వీసులను ఆగస్టు 7 నుండి సెప్టెంబర్ 25 వరకు ఎనిమిది ట్రిప్పులకు పొడిగిస్తారు. ఈ రైలు ప్రతి గురువారం రాత్రి 9.50 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

⦿ విశాఖపట్నం-చర్లపల్లి వీక్లీ స్పెషల్ రైలు

విశాఖపట్నం-చర్లపల్లి వీక్లీ స్పెషల్ (08579) వీక్లీ స్పెషల్ రైలు సర్వీసులను కూడా పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 26 వరకు (మొత్తం తొమ్మిది ట్రిప్పులు) నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.  తిరుగు ప్రయాణంలో, చర్లపల్లి-విశాఖపట్నం (08580) వీక్లీ స్పెషల్ రైలు ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 27 వరకు (తొమ్మిది ట్రిప్పులు) నడపనున్నారు. ఈ రైలు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె. సాన్‌దీప్  వెల్లడించారు.

Read Also: ఇకపై పావు గంట ముందే వందేభారత్ టికెట్ బుక్ చేసుకొవచ్చు.. కేవలం ఈ 8 రైళ్లలోనే!

ప్రత్యేక రైలు సేవలు వినియోగించుకోవాలన్న అధికారులు

పండుగ రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకన్నట్లు కె. సాన్‌దీప్  తెలిపారు. ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ఈ ప్రత్యేక రైలు సర్వీసులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను స్థానిక రైల్వే స్టేషన్లతో పాటు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లోనూ చూసుకోవచ్చన్నారు. ప్రయాణీకులు ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేసేందుకు ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Read Also: వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ముందు పరుగులు తీసేది ఈ రూట్‌ లోనే!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×