E-Paper
Advertisement

Secunderabad Station: విశాఖ నుంచి వచ్చే ప్రయాణీకులకు అలర్ట్, ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్ లో ఆగవట!

Secunderabad Station: విశాఖ నుంచి వచ్చే ప్రయాణీకులకు అలర్ట్, ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్ లో ఆగవట!

Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను దారి మళ్లించారు. ఇప్పటికే పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. తాజాగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వచ్చే రైళ్లు ఇకపై సికింద్రాబాద్ లో ఆగవని సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లు నేరుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్తాయని తెలిపింది. ఇకపై అక్కడి నుంచే రాకపోకలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

ఏ రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగవంటే?

⦿ విశాఖపట్నం- హజూర్ సాహిబ్ నాందేడ్- విశాఖపట్నం (రైలు నెం. 20811/20812) ట్రై-వీక్లీ ఎక్స్‌ ప్రెస్ ఏప్రిల్ 26 నుంచి సికింద్రాబాద్ లో ఆగదు. నేరుగా చర్లపల్లికి వెళ్తుంది. విశాఖపట్నం నుంచి హజూర్ సాహిబ్ నాందేడ్‌ కు వెళ్లే రైలు ఉదయం 6:45 గంటలకు చర్లపల్లిలో ఆగుతుంది. తిరిగి వచ్చే సమయంలో ఈ రైలు రాత్రి 9:15 గంటలకు ఇదే స్టేషన్‌లో ఆగుతుంది.

⦿ విశాఖపట్నం-సాయి నగర్ షిర్డీ-విశాఖపట్నం (రైలు నెం. 18503/8504) వీక్లీ ఎక్స్‌ ప్రెస్ ఈ నెల 24 నుంచి సికింద్రాబాద్ లో కాకుండా నేరుగా చర్లపల్లిలో ఆగుతుంది. ఈ రైలు రాత్రి 8:10 గంటలకు చర్లపల్లిలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 8:45 గంటలకు ఆగుతుంది.

⦿ విశాఖపట్నం- లోకమాన్య తిలక్- విశాఖపట్నం డైలీ ఎక్స్‌ ప్రెస్(రైలు నెం. 18503/18504) ఇకపై మౌలాలి  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో ఆగదు. విశాఖపట్నం నుంచి  వెళ్లే రైలు  మధ్యాహ్నం 12:35 గంటలకు చెర్లపల్లిలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు రాత్రి 8:15 గంటలకు అక్కడే ఆగదు. ఏప్రిల్ 22 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.

⦿ విశాఖపట్నం- లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్(రైలు నెం. 12805/2806) ఏప్రిల్ 24 నుంచి సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో ఆగదు. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు నడిచే ఈ రైలు సాయంత్రం 6:05 గంటలకు చర్లపల్లిలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 7:15 గంటలకు అదే స్టేషన్‌లో ఆగుతుంది.

Read Also: కాశ్మీర్ అందాలు చూడాలనుందా? తక్కువ ధరలో స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC!

సికింద్రాబాద్ స్టేషన్‌ లో ఆగని ఇతర రైళ్లు

⦿ తిరుపతి- ఆదిలాబాద్- తిరుపతి కృష్ణ ఎక్స్‌ ప్రెస్(రైలు నెం. 17405/17406) సికింద్రాబాద్- మల్కాజ్ గిరి మార్గం కాకుండా బొల్లారం మీదుగా వెళ్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ రైలు  మల్కాజ్‌ గిరి, మౌలా అలీ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగదు.

⦿ లింగంపల్లి- కాకినాడ టౌన్- లింగంపల్లి ఎక్స్‌ ప్రెస్‌(రైలు నెం. 07446/07445) ఏప్రిల్ 2 నుంచి సనత్‌ నగర్ నుంచి అమ్ముగూడ బైపాస్ ద్వారా చెర్లపల్లి వైపు మళ్లిస్తారు. సికింద్రాబాద్ లో ఈ రైలు ఆగదు.

⦿ కాజీపేట-హడప్సర్- కాజీపేట (రైలు నంబర్ 17014/17013) రైలు ఏప్రిల్ 22 నుంచి బేగంపేట స్టేషన్‌, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగదు.

⦿ సికింద్రాబాద్-కర్నూల్ సిటీ- సికింద్రాబాద్ తుంగభద్ర ఎక్స్‌ ప్రెస్(17023/17024) ఏప్రిల్ 10 నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు బదులుగా కాచిగూడ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

Read Also:  రైలు టికెట్ ను ఫ్యామిలీ మెంబర్స్ కి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×