E-Paper
Advertisement

Indian Railways: ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ అవసరం లేదు, నేరుగా టికెట్ తీసుకొని ఎక్కేయొచ్చు!

Indian Railways: ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ అవసరం లేదు, నేరుగా టికెట్ తీసుకొని ఎక్కేయొచ్చు!

చాలా మంది ప్రయాణీకులు రిజర్వేషన్లు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా రిజర్వేషన్లు లేకుండా సేవలను పొందేందుకు వీలు కల్పించేలా కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులు ఉన్న మార్గాల్లో ఈ రైళ్లు సేవలు అందిస్తాయి. ఈ రైళ్లలో వెళ్లాలి అనుకునే వాళ్లు బోర్డింగ్ స్టేషన్ లో జనరల్ టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. UTS యాప్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రైళ్లలో జనరల్, చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.

కొత్త రైళ్లు, షెడ్యూల్ వివరాలు

IRCTC తాజాగా తీసుకొచ్చిన 10 కొత్త రైళ్లు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతాయి. ఇంతకీ ఆ రైళ్లు ఏ మార్గాల్లో నడుస్తాయి. టైమింగ్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ముంబై- పుణె సూపర్‌ ఫాస్ట్: ముంబై నుండి ఉదయం 7:30 గంటలకు బయల్దేరి ఫుణె వరకు వెళ్తుంది.

⦿హైదరాబాద్- విజయవాడ ఎక్స్‌ ప్రెస్: హైదరాబాద్ నుంచి ఉదయం 7:30 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2:00 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

⦿ఢిల్లీ- జైపూర్ ఎక్స్‌ ప్రెస్: ఢిల్లీ నుంచి ఉదయం 6:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1:30 గంటలకు జైపూర్ చేరుకుంటుంది.

⦿లక్నో-వారణాసి ఎక్స్‌ ప్రెస్: లక్నో నుంచి ఉదయం 7:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1:30 గంటలకు వారణాసి చేరుకుంటుంది.

⦿కోల్‌ కతా- పాట్నా ఇంటర్‌ సిటీ: కోల్‌ కతా నుంచి  ఉదయం 5:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2:00 గంటలకు పాట్నా చేరుకుంటుంది.

⦿అహ్మదాబాద్-  సూరత్ సూపర్ ఫాస్ట్: అహ్మదాబాద్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12:30 గంటలకు సూరత్ చేరుకుంటుంది.

⦿పాట్నా- గయ ఎక్స్‌ ప్రెస్: ఉదయం 6:00 గంటలకు పాట్నా నుంచి బయల్దేరి రాత్రి 9:30 గంటలకు గయ చేరుకుంటుంది.

⦿జైపూర్- అజ్మీర్ సూపర్ ఫాస్ట్: ఉదయం 8:00 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరి రాత్రి 11:30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది.

⦿చెన్నై-బెంగళూరు ఎక్స్‌ ప్రెస్: ఉదయం 8:00 గంటలకు చెన్నై నుండి బయల్దేరి మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

⦿భోపాల్- ఇండోర్ ఇంటర్‌ సిటీ: ఉదయం 6:30 గంటలకు భోపాల్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:00 గంటలకు ఇండోర్ చేరుకుంటుంది.

Read Also: మీ టికెట్ తో వేరే వాళ్లు కూడా జర్నీ చెయ్యొచ్చు, ఇండియన్ రైల్వే కొత్త రూల్ గురించి తెలుసా?

టికెట్లు ఎలా తీసుకోవాలి?

⦿తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లకు సంబంధించిన టికెట్లు స్టేషన్ టికెట్ కౌంటర్‌ లో తీసుకోవచ్చు.

⦿మీరు స్టేషన్ కౌంటర్ ముందుక క్యూలో నిలబడటం ఇష్టం లేకపోతే UTS (అన్‌రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌ ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

⦿అటు ఈ సమీపంలోని జన సేవా కేంద్రం (పబ్లిక్ సర్వీస్ సెంటర్) నుంచి కూడా టికెట్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Read Also: పాపం, చవకగా వచ్చాయని కొంటే.. పాత సామాన్లుగా మారిన 20 చైనా మేడ్ రైళ్లు!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×