BigTV English
Advertisement

Railway Coaches Code: రైలు బోగీల మీద కోడ్ నెంబర్లు, ఇంతకీ వాటి వెనుకున్న అర్థం ఏంటో తెలుసా?

Railway Coaches Code: రైలు బోగీల మీద కోడ్ నెంబర్లు, ఇంతకీ వాటి వెనుకున్న అర్థం ఏంటో తెలుసా?

Indian Railways: తరచుగా రైలు ప్రయాణం చేసే వారికి వచ్చే డౌట్లలో ఒకటి కోచ్ ల మీద ఉండే కోడ్ నెంబర్స్. రైలులోని ప్రతి బోగీ మీద ఓ కోడ్ నెంబర్ ఉంటుంది. ఇంతకీ ఈ కోడ్ నెంబర్ వెనుక ఉన్న అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ కోడ్ నెంబర్ వెనుకున్న అసలు విషయాన్ని తెలుసుకుందాం..


ప్రతి రైలులో పెద్ద సంఖ్యలో బోగీలు ఉంటాయి. ఆయా రూట్లలో రద్దీని బట్టి అధికారులు రైళ్లకు బోగీల సంఖ్యను నిర్ణయిస్తారు. అయితే, రైలులోని ప్రతి బోగీ మీద 5 అంకెలతో కూడిన కోడ్ నెంబర్ ఉంటుంది. ఈ కోడ్ నెంబర్ వెనుకున్న అర్థం ఏంటో చాలా మందికి తెలియదు.

తొలి రెండు అంకెలు ఏం సూచిస్తాయంటే?


ప్రతి బోగీ మీద 5 అంకెలతో కూడిన కోడ్ నెంబర్ ఉండగా, అందులో తొలి రెండు నెంబర్లు బోగీ తయారీ సంవత్సరాన్ని సూచిస్తాయి. ఒకవేళ బోగీ కోడ్ నెంబర్ లో తొలి రెండు అక్షరాలు 98 అని ఉంటే ఆ బోగీ 1998లో తయారు చేశారని అర్థం చేసుకోవాలి. అదే 21 అని ఉంటే 2021లో తయారు చేశారని అర్థం. ఎందుకు ఈ కోడ్ నెంబర్ వేస్తారంటే.. ప్రతి బోగీకి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉంటుంది. తయారీ సమయంలోనే ఈ బోగీని ఎంతకాలం ఉపయోగించాలనేది నిర్ణయిస్తారు. ఆ విషయం తెలిసేలా బోగీ మీద రాస్తారు.

చివరి మూడు అంకెల అర్థం ఏంటంటే?

రైలు బోగీ మీద ఉన్న తొలి రెండు అంకెలు తయారీ సంవత్సరాన్ని సూచిస్తే, తర్వాతి మూడు అంకెలు కోచ్ టైప్ ను వివరిస్తాయి. రైళ్లలో సాధారణంగా ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ఈ కోడ్ నెంబర్ కూడా ఏ క్లాస్ కు చెందిన బోగీ అనే విషయాన్ని వివరిస్తాయి. చివరి మూడు అంకెల్లో 1 నుంచి 200 నెంబర్ ఉంటే అది ఏసీ క్లాస్ కోచ్ గా గుర్తించాలి. ఇక ఆ నెంబర్ 200 నుంచి 400 మధ్యలో ఉంటే అది స్లీపర్ క్లాస్ కోచ్ గా గుర్తించాలి. 400 నుంచి 600 మధ్యలో ఉంటే అది జనరల్ బోగీ అని అర్థం. ఒకవేళ మీరు చూసిన బోగీ మీద 337 అని రాసి ఉంటే, అది స్లీపర్ క్లాస్ బోగీగా గుర్తించాలి.

Read Also: ఓ మై గాడ్, రైళ్లలో బ్లాంకెట్స్‌ను అన్ని రోజుల వరకు ఉతకరా? రైల్వే మంత్రి చెప్పింది వింటే నిద్ర పట్టదు!

భారతీయ రైల్వే గురించి..

ఇక భారతీయ రైల్వే సంస్థ ఆసియాలోనే రెండో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. భారత్ లో రోజూ రైలు ప్రయాణం ద్వారా 2 నుంచి 3 కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ధరకు మెరుగైన ప్రయాణాన్ని చేసే అవకాశం ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతారు.

Read Also: రూ.1.5 లక్షలు గెలుచుకొనే అవకాశం.. వెంటనే ఇలా చెయ్యండి!

Related News

IRCTC TN Temples Tour: హైదరాబాదు నుండి తమిళనాడు ఆలయాల యాత్ర.. 7 రోజుల ఆధ్యాత్మిక పర్యటన వివరాలు

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Big Stories

×