BigTV English
Advertisement

Indian Railways: రైలుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయితే? రైల్వే ఏం చేస్తుందో తెలుసా?

Indian Railways: రైలుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయితే? రైల్వే ఏం చేస్తుందో తెలుసా?

భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. దేశ వ్యాప్తంగా సుమారు 13 వేల రైళ్లు ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు రాకపోకలు కొనసాగిస్తాయి. అయితే, కొన్ని అరుదైన సందర్భాల్లో రన్నింగ్ రైళ్లకు బ్రేకులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో రైల్వే అధికారులు ఏం చేస్తారు? ప్రయాణీకుల ప్రాణాలను కాపాడేందుకు ఏ చర్యలు తీసుకుంటారు? అనేది ఇప్పుడు చూద్దాం..


రైలు బ్రేకులు ఫెయిల్ అయితే ఎలా?

భారత్ లో ప్రస్తుతం రైల్వే భద్రత విషయంలో అధికారులు కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాదాలను అరికట్టి, రైల్వే ప్రయాణీకుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కవచ్ లాంటి నూతన టెక్నాలజీతో అసలు రైళ్లు ఒకే ట్రాక్ మీదికి వచ్చి యాక్సిడెంట్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అత్యంత అరుదుగా రైళ్లకు బ్రేకులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతీయ రైల్వే పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ప్రయాణీకులకు అపాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి రైల్వే స్టేషన్ చివర్లో శాండ్ హంబ్ నిర్మిస్తారు.


శాండ్ హంబ్ లోకి రైలు మళ్లింపు

రైలుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయనే సమాచారం రాగానే,  సమీప రైల్వే స్టేషన్ లోని స్టేషన్ మాస్టర్ రైలును శాండ్ హంబ్ లూప్ లైన్ లోకి తీసుకుంటాడు. ఇక్కడ ఫ్రెక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల రైలు ఒక్కసారిగా స్లో అవుతుంది. చివరకు ఆగిపోతుంది. ప్రయాణీకులు అందరూ సేఫ్ అవుతారు. భారత్ లో ప్రస్తుతం బ్రేకులు ఫెయిల్ ఘటనలు చాలా వరకు తగ్గిపోయాయి. అరుదైన సందర్భాల్లో మాత్రమే రైళ్ల బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి. ఒకవేళ రైలు బ్రేకులు ఫెయిల్ అయినా, ఎలాంటి నష్టం కలగకుండా రైల్వే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read Also: రైల్వే టికెట్లలో ఇన్ని రకాల వెయిటింగ్ లిస్టులు ఉంటాయా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

భారీగా తగ్గిన రైల్వే ప్రమాదాలు

దేశంలో రైల్వే ప్రమాదాలను తగ్గించేందుకు రైల్వేశాఖ కీలక చర్యలు చేపడుతోంది. 2014తో పోల్చితే 2024 వరకు రైల్వే ప్రమాదాలు గణనీయంగా తగ్గినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వేల డేటా ప్రకారం,  2004-14 కాలంలో  జరిగిన రైలు ప్రమాదాలు 1,711. సంవత్సరానికి సగటున 171 ప్రమాదాలు జరిగాయి.  ఇది 2014-24 కాలంలో 678కి తగ్గింది. సంవత్సరానికి సగటున 68 ప్రమాదాలు జరిగినట్లు వెల్లడించింది. రైల్వే ప్రమాదాలు తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే భారీగా ఖర్చు చేస్తోంది.

Read Also: ఈ రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఇంతకీ అది ఎక్కడుందో తెలుసా?

Related News

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Big Stories

×