E-Paper
Advertisement

Indians Denied: భారతీయులకు నో ఎంట్రీ.. 10 మందిని వెనక్కి పంపిన మలేషియా, ఎందుకంటే?

Indians Denied: భారతీయులకు నో ఎంట్రీ.. 10 మందిని వెనక్కి పంపిన మలేషియా, ఎందుకంటే?

భారతీయులు ఎలాంటి వీసా లేకుండా మలేషియాలో పర్యటించే అవకాశం ఉన్నప్పటికీ తాజాగా, 10 మంది భారతీయలను తమ దేశంలోకి అనుమతించలేదు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు. మొత్తం 400 మంది విదేశీ ప్రయాణీకులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రశ్నించారు. వీరిలో 10 మంది భారతీయులు ఉన్నారు. వారిని మలేషియాలోని అనుమతించకుండా వెనక్కి తిప్పి పంపించారు. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం (KLIA) లో ఈ ఘటన జరిగింది.

99 మంది విదేశీ ప్రయాణీకులను వెనక్కి పంపిన అధికారులు

మలేషియా బోర్డర్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (AKPS) అధికారులు తాజాగా KLIA టెర్మినల్ 1లో సుమారు ఏడు గంటల పాటు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించారు. ఎక్కువ ప్రమాదకర విమానాల నుంచి వచ్చిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో సుమారు 400 మందికి పైగా ప్రయాణికులను చెక్ చేశారు. వారిలో 99 మందిని తిరిగి వెనక్కి పంపించారు. వీరిలో 80 మంది బంగ్లాదేశ్ వాసులు ఉండగా, 10 మంది భారతీయులు, 9 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో అందరూ పురుషులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎందుకు వీరిని వెనక్కి పంపించారంటే?

తాజా తనిఖీల్లో వెనక్కి పంపించిన 99 మంది ప్రయాణీకులు అనుమానాస్పద రీతిలో మలేషియాలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. “తాజాగా వెనక్కి పంపిన విదేశీలకు సంబంధించి విజిటింగ్, జర్నీ రికార్డులు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. చెకింగ్స్ లో సరైన సమాధానాలు చెప్పకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం కారణంగా వారిని దేశంలోకి అనుమతించలేదు” అని AKPS ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది.  ప్రోటోకాల్‌ ప్రకారం వారిని స్వదేశాలకు తరలించినట్లు వెల్లడించింది.

“మలేషియా బోర్డర్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తనిఖీల సందర్భంగా ప్రయాణీకుల బ్యాగ్రౌండ్ వెరిషికేషన్ చేశారు.  ప్రయాణ పత్రాల పరిశీలించారు. వ్యక్తిగతంగానూ వారిని ఇంటర్వ్యూ చేశారు. సరైన సమాధానలు లేకపోవడం వల్లే తిరిగి పంపించాల్సి వచ్చింది.  విజిట్ పాస్‌ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి ఇలాంటి తనిఖీలు ఇకపై తప్పకుండా నిర్వహించబడుతాయయి” అని AKPS తెలిపింది.

Read Also: ముందు చక్రం లేని సైకిల్‌పై సాహస యాత్ర.. ఘాట్ రోడ్డులో అతడి అడ్వేంచర్ చూస్తే షాకే!

వీసా రహిత ప్రవేశ పథకాన్ని పొడిగించిన కొద్దిసేపటికే

భారతీయ పౌరులకు  మలేషియా వీసా రహిత ప్రవేశ పథకాన్ని డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. తాజా నిర్ణయం ప్రకారం భారతీయ పర్యాటకులు వీసా లేకుండా ఆ దేశంలో 30 రోజుల వరకు ఉండవచ్చు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని మలేషియా ప్రభుత్వం  భావిస్తోంది.

Read Also: ఇండియాలో ఈ రైళ్లు ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి.. ఒక్క టికెట్ ధర ఎంతో తెలుసా?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×