E-Paper
Advertisement

IRCTC Shirdi Package: విజయవాడ నుంచి షిరిడీకి రైల్వే సూపర్ ప్యాకేజ్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

IRCTC Shirdi Package: విజయవాడ నుంచి షిరిడీకి రైల్వే సూపర్ ప్యాకేజ్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

IRCTC Shirdi Package: సాయిబాబా భక్తులకు షిరిడీ యాత్ర అంటే ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు షిరిడీకి వెళ్లి సాయిబాబా ఆశీస్సులు పొందుతారు. అయితే ఈ యాత్రను సులభతరం చేస్తూ, భక్తుల ఖర్చు తగ్గించేందుకు ఇండియన్ రైల్వే ఒక అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. సాయి సన్నిధి ఎక్స్ – విజయవాడ పేరిట అందిస్తున్న ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా భక్తులు షిరిడీతో పాటు శనిశింగ్నాపూర్ దర్శనం కూడా చేయవచ్చు. ఈ ప్యాకేజీ ప్రత్యేకతలు, ఛార్జీలు, షెడ్యూల్, ఇంకా అందించే సౌకర్యాల గురించి తప్పక తెలుసుకుందాం.

ఈ ప్యాకేజీ ప్రయాణం విజయవాడ నుండి ప్రతి మంగళవారం ఉదయం 10:15 గంటలకు ప్రారంభమవుతుంది. రైలు నేరుగా షిరిడీకి వెళ్లేలా సదుపాయం కల్పించబడింది. ప్రయాణం స్లీపర్ క్లాస్ (SL) లేదా త్రీ-టియర్ ఏసీ (3AC) కోచ్‌లలో జరగనుంది. ఇది మాత్రమే కాదు, ప్రయాణంలో 2 రోజుల బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తారు. షిరిడీ, శనిశింగ్నాపూర్ 2 చోట్లా సులభంగా దర్శనం చేసేలా ఈ ప్యాకేజీని రైల్వేలు డిజైన్ చేశాయి.

టారిఫ్ వివరాలు ఇవే..
ఒకటి నుండి మూడు మంది ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలు ఉన్నాయి. కంఫర్ట్ (3AC) సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 16,150, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 10,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 8,520. 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 7,630, బెడ్ లేకుండా రూ. 6,630 మాత్రమే. స్టాండర్డ్ (SL) సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 13,810, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 7,760, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 6,180. పిల్లలకు బెడ్‌తో రూ. 5,290, బెడ్ లేకుండా రూ. 4,290 మాత్రమే.

4 నుండి 6 మంది ప్రయాణికుల గ్రూప్‌లో ఉన్నవారికి కూడా ఆఫర్లు ఉన్నాయి. కంఫర్ట్ (3AC) ట్విన్ షేరింగ్ రూ. 8,690, ట్రిపుల్ షేరింగ్ రూ. 8,020, పిల్లలకు బెడ్‌తో రూ. 7,630, బెడ్ లేకుండా రూ. 6,630. స్టాండర్డ్ (SL) ట్విన్ షేరింగ్ రూ. 6,350, ట్రిపుల్ షేరింగ్ రూ. 5,680, పిల్లలకు బెడ్‌తో రూ. 5,290, బెడ్ లేకుండా రూ. 4,290 మాత్రమే.

ప్రయాణ షెడ్యూల్.. 3 రాత్రులు, 4 రోజుల ప్యాకేజీ
మంగళవారం: ఉదయం 10:15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి సైనగర్ శిరిడీ ఎక్స్‌ప్రెస్ (17208) ఎక్కి ప్రయాణం మొదలవుతుంది. ఇది రాత్రంతా ప్రయాణం.
బుధవారం: ఉదయం 6:15 గంటలకు నాగర్సోల్ చేరుకుని, అక్కడి నుంచి AC వాహనంలో శిరిడీ హోటల్‌కి డ్రాప్ చేస్తారు. అక్కడ భక్తులు స్వయంగా సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవచ్చు. సాయంత్రం భక్తులకు స్వేచ్ఛా సమయం ఉంటుంది. రాత్రి షిరిడీలోనే బస సదుపాయం కల్పిస్తారు.
గురువారం: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మళ్లీ శిరిడీ దర్శనం చేయవచ్చు. మధ్యాహ్నం శనిశింగ్నాపూర్ యాత్ర ఉంటుంది. అక్కడ శని దేవుని ఆలయం దర్శనం చేసి తిరిగి నాగర్సోల్‌కు వస్తారు. సాయంత్రం 7:25 గంటలకు రైలు ఎక్కి విజయవాడకు తిరిగి బయలుదేరుతారు. ఇది రాత్రంతా ప్రయాణం.
శుక్రవారం: మధ్యాహ్నం 3:00 గంటలకు విజయవాడ చేరుకుంటారు.

Also Read: Indian Railways incidents: ఒక్కరి కోసం రైలు ఆగింది.. నమ్మడం లేదా? అయితే ఆ చిట్టా ఇదే!

ప్యాకేజీలో సౌకర్యాలు..
భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేలు పలు ఫెసిలిటీస్‌ను అందిస్తున్నాయి. స్లీపర్ క్లాస్ లేదా 3AC క్లాస్‌లో ట్రైన్ జర్నీ, షెడ్యూల్‌లో సూచించిన ప్రదేశాలకు AC వాహనంలో ప్రయాణం, రెండు రోజుల బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, అన్ని పన్నులు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. భక్తులకు దర్శనం సౌకర్యవంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తారు.

ప్యాకేజీలో లేని సౌకర్యాలు
దేవాలయ దర్శన టిక్కెట్లు, లంచ్, డిన్నర్, రైలు ప్రయాణంలో ఆహారం, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టిక్కెట్లు, టూర్ గైడ్ సర్వీస్, వ్యక్తిగత ఖర్చులు ఈ ప్యాకేజీలో ఉండవు. ఇవి భక్తులే అదనంగా చూసుకోవాలి.

ప్రత్యేకతలు
ఈ ప్యాకేజీ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో భక్తులు షిరిడీ, శనిశింగ్నాపూర్ దర్శనం చేయగలిగేలా ప్యాకేజీని ప్రత్యేకంగా రూపొందించారు. భద్రత, సౌకర్యం, సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ ప్యాకేజీ, కుటుంబాలతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భక్తులు ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణిస్తే, సులభంగా రైలు ప్రయాణం, శ్రద్ధగా ఏర్పాటుచేసిన వసతి, సురక్షితమైన సైట్ సీయింగ్ సదుపాయాలు లభిస్తాయి. సాయి దర్శనాన్ని మరింత ఆధ్యాత్మికంగా, ప్రశాంతంగా అనుభవించాలనుకునే వారు ఈ ప్యాకేజీని తప్పక పరిశీలించాలి.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×