E-Paper
Advertisement

Train Journey for Rs 25: జస్ట్ రూ.25తో దేశమంతా ప్రయాణం, జాగృతి రైలు యాత్ర గురించి మీకు తెలుసా?

Train Journey for Rs 25: జస్ట్ రూ.25తో దేశమంతా ప్రయాణం, జాగృతి రైలు యాత్ర గురించి మీకు తెలుసా?
Advertisement

Indian Railways Jagriti Yatra: దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ రైలు ప్రయాణం ద్వారా ఎక్స్ ప్లోర్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే ఓ అద్భతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో ఏకంతా దేశ వ్యాప్తంగా మేజర్ సిటీలను చుట్టి వచ్చేలా ఈ యాత్రను ప్లాన్ చేసింది. 15 రోజుల పాటు 8,000 కిలో మీటర్ల మేర కొనసాగుతుంది. ఈ యాత్ర ఏడాదికి ఒకేసారి ఉంటుంది. ఈ రైలుకు సంబంధించి టికెట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

జాగృతి యాత్ర.. ఏడాదికి ఒకేసారి!

Advertisement

జాగృతి యాత్ర పేరుతో 2008 నుంచి ఈ రైలు నడుస్తుంది. కానీ, చాలా మందికి ఇప్పటికీ ఈ రైలు గురించి తెలియదు.  ఈ రైలు లక్ష్యం పెంట్రపెన్యూర్ ద్వారా భారతదేశాన్ని బలంగా నిర్మించడం. ఈ రైలు ప్రయాణం ద్వారా యువత, ఎంట్రపెన్యూర్స్ గా ఎలా మారాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రైలులో కేవలం 500 మంది మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.  వీరిని ఎంట్రపెన్యూర్స్ గా ఎలా ఎదగాలనే అంశానికి సంబంధించి అవగాహన కల్పిస్తారు. ఈ ప్రయాణం 15 రోజుల పాటు 8,000 కిలో మీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది.

జాగృతి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే?

Advertisement

యువతకు ఎంతగానో ఉపయోగపడే ఈ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలు మొదటి స్టాప్ అహ్మదాబాద్.  తరువాత ముంబై. ఆ తర్వాత బెంగళూరు మీదుగా మధురైకి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఒడిశాకు వెళ్తుంది. అటు నుంచి మళ్లీ ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో యువతీ యువకులను  అనేక పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు.

2025లో ప్రయాణం ఎప్పుడు?

ఈ రైలు ప్రయాణం ప్రతి ఏటా నవంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైలులో ప్రయాణించే వారి వయసు 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఏడాది జాగృతి యాత్రం నవంబర్ 7న ప్రారంభమై నవంబర్ 22న ముగుస్తుంది.

టికెట్ ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి?

ఇతర రైళ్లతో పోల్చితే ఈ రైలులో ప్రయాణ ఛార్జీలు చాలా తక్కువ. ఒకవేళ మీరు ఈ యాత్ర నిబంధనల పరిధిలోకి వస్తే, 15 రోజుల ప్రయాణానికి కేవలం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. https://www.jagritiyatra.com/ లో ఈ యాత్రకు సంబంధించిన టికెట్ బుక్ చేసుకోవచ్చు. నవంబర్ లో మొదలయ్యే ఈ యాత్రకు అక్టోబర్ 15 నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ రైలులో ప్రయాణించాలనకునే యువతను బాగా ఫిల్టర్ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు.

ఈ యాత్రతో కలిగే లాభం ఏంటి?

జాగృతి యాత్ర ద్వారా యువత కొత్త వ్యక్తులను కలుస్తారు. ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది. ఆయా ప్రదేశాల గొప్పదనం తెలుసుకోవచ్చు. దేశంలోని ఆఫ్‌ బీట్ ప్రదేశాలను అన్వేషించడానికి మీకు ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది.

Read Also:  జపాన్ లో ఆహా అనిపించే అద్భుతమైన ఎయిర్ పోర్టులు, చూస్తే, ఆశ్చర్యపోవడం పక్కా!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×