E-Paper
Advertisement

Maha Kumbh Mela: రూ. 5 వేల కోట్లు, 13 వేల రైళ్లు.. మహా కుంభమేళాలకు రైల్వే కనీవినీ ఎరుగని ఏర్పాట్లు

Maha Kumbh Mela: రూ. 5 వేల కోట్లు, 13 వేల రైళ్లు.. మహా కుంభమేళాలకు రైల్వే కనీవినీ ఎరుగని ఏర్పాట్లు
Advertisement

Ashwini Vaishnaw Reviews Maha Kumbh Preparations: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు సిద్ధం అవుతున్నది. వచ్చే నెలలో జరుగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలకు యోగీ సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడుకల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులకు రద్దీకి అనుగుణంగా రైళ్లను షెడ్యూల్ చేస్తున్నది. తాజాగా మహా కుంభమేళాకు సంబంధించి రైల్వే అధికారులు చేస్తున్న ఏర్పాట్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

మహా కుంభమేళా కోసం 13 వేల రైళ్లు

Advertisement

ప్రయాగ్ రాజ్ లోమహా కుంభమేళా కోసం జరుగుతున్న ఏర్పాట్లను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. తొలుత ఝూన్సీ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆ తర్వాత మహా కుంభమేళా సన్నాహాలను పరిశీలించారు. అనంతరం  గంగా నదిపై ప్రయాగ్‌ రాజ్-వారణాసి రైల్వే మార్గంలో నిర్మిస్తున్న కొత్త రైల్వే బ్రిడ్జి డబ్లింగ్ పనులను చూశారు.  మహా కుంభమేళా కోసం గత రెండు సంవత్సరాలుగా రూ. 5,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  అంతేకాదు, 13 వేల రైళ్లను షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైళ్లను నడుపుతున్నట్లు వివరించారు. ఈ 13 వేల రైళ్లలో 3 వేలు ప్రత్యేక రైళ్లు ఉన్నట్లు తెలిపారు. గత కుంభమేళాలో 7000 రైళ్లను నడిపినట్లు చెప్పిన ఆయన, ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు.

రైళ్లకు రెండు వైపులా ఇంజిన్లు

Advertisement

ఇక మహా కుంభమేళాకు షెడ్యూల్ చేసిన సాధారణ రైళ్లలో రెండు వైపుల ఇంజిన్లు ఉంటాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా చాలా సమయం ఆదా అవుతుందన్నారు. దీంతో సమయం ఆదా అవుతుంది. అటు తక్కువ దూరాల నుంచి వచ్చే భక్తుల కోసం పెద్ద మొత్తంలో MEMU రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు స్టేషన్లలో స్టేషన్లలో 43 పర్మినెంట్ హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు

పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడా అసౌకర్యం కలగకుండా రైల్వే సంస్థ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్యాసింజర్ వెయిటింగ్ రూమ్ లలో ఫుడ్, వాటర్, మెడికల్ ఏర్పాట్లు, టాయిలెట్స్ వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, మహా కుంభమేళాలో అత్యవసర పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన ర్యాపిడ్ యాక్షన్ టీమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ఫైర్ టీమ్ తో కేంద్రమంత్రి ఇంపాక్ట్ అయ్యారు. మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి పలు సూచనలు చేశారు. మహా కుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి విషయంలోనూ పక్కా ప్లాన్, పర్యవేక్షణ ఉండాలని అధికారులకు రైల్వేమంత్రి సూచించారు. ఈ సందర్భంగా, రైల్వే అనౌన్స్ మెంట్, టికెట్ ఇష్యూ కేంద్రాలను ఆయన సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు.

Read Also: ఇంజిన్ లేకుండా వందే భారత్ ట్రైన్ అంత వేగంగా ఎలా ప్రయాణిస్తోంది? సాధారణ రైలుకి దీనికి తేడా ఏమిటి?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×